–రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Minister Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొ స్తుందని, పెట్టుబడి సహాయం కూడా సంవత్సరా నికి ఎకరానికి రూ. 5 వేల చొప్పున పెంచుతు న్నామని, ఐతే రైతుబంధు తర హాలో ప్రజాధనము వృధా కాకుండా ఉండేందుకు పటిష్ట విధానాలను రూపొందించుటకు తమ ప్రభుత్వ ము కసరత్తు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 గ్రామీణ నియోజకవర్గాల్లో వున్న రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ (Video conference at Rythuvedical) ద్వారా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమం లో భాగంగా మంగళవారం ప్రభు త్వం ప్రవేశపెట్టే ‘రైతు భరోసా’ గు రించి రైతుల అభిప్రాయాలు తెలు సుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ గతంలో సాగు లో లేని భూములకు కూడా రైతు బంధు వర్తింపచేసి 12 విడతలలో దాదాపు రూ. 25,670 కోట్ల ప్రజా ధనం వృధా చేశారని ఆరోపించారు. 93శా తం వాటా ఉన్న సన్న, చిన్నకా రు రైతుల వాటా రైతుబంధు (Ryth u Bandhu) మొ త్తంలో 68 శాతం కూడా లేదని, అంతే కాకుండా 17.5శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని పేర్కొ న్నారు.
ఆ తర్వాత దాదాపు అన్ని జిల్లాలనుండి రైతు లు, మంత్రివర్యులు ఇలా ప్రత్యక్షం గా రైతుల అభిప్రాయాలు తీసుకో వడం శుభపరిణా మం అని, రైతులకు (farmers) వర్తింపచేసే పథకాలలో విధివి ధానాలలో వారిని కూడా భాగస్వా మ్యం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారివారి సూచనలు అందించారు. చాలా మంది రైతులు పథకాన్ని సాగుచేసే వారికి, అదేవి ధంగా సాగులో ఉన్న భూమికే పెట్టు బడి సహాయం అందించాలని, అంతే కాకుండా గరిష్ట పరిమితి విధించి రైతుభరోసా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు.
రైతు నేస్తం కార్యక్రమంలో వెల్లడించిన మరియు రాతపూర్వకంగా సేకరిం చిన సూచనలను అన్నిటిని క్రోడిక రించి, ఒక నివేదిక తయా రుచేయ వల్సిందిగా డైరెక్టర్ గోపి (Director Gopi) ని ఆదేశిం చారు. తమ ప్రభుత్వం రైతుభరోసా కు సంబంధించి ఎటువంటి విధాన పరమైన నిర్ణయాలు ఇంకా తీసుకో లేదని, పూర్తిగా అందరి అభిప్రాయా లు మరియు శాసనసభలో గౌరవ సభ్యులతో చర్చించిన పిదప పథకా న్ని తీసుకొస్తామని, ఆలస్యమైన కూడా అర్హులకు మాత్రమే అందేవి ధంగా రూపకల్పన చేస్తామని తెలియచేశారు.
రైతునేస్తం కార్యక్రమంలో ప్రణాళికసంఘ ఉప చైర్మన్ చిన్నారెడ్డి , అఖిలభారత కిసాన్ సెల్ ఉపాధ్య క్షులు కొదండరెడ్డి , రైతుసంఘ నాయకులు అన్వెష్ రెడ్డి, వ్యవ సాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావుగారు, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ డైరెక్టర్లు, జిల్లాల నుండి కలెక్టర్లు, జిల్లా వ్యవసా యాధికారులు, రైతులు పాల్గొ న్నారు.