Minister Uttam Kumar : ప్రజా దీవెన , నల్లగొండ: దేశంలోనీ నిష్ణాతులతో రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేపట్టనున్నట్లు, మూడు నెలల్లో తిరిగి సోరంగ పను లు ప్రారంభించనున్నట్లు మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్ ఎల్ బి సి క్యాంప్ కార్యాలయం ద గ్గర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు చిక్కు డు వంశీకృష్ణ, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరా వుతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురువారం ఉద యం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కటింగ్ నిష్ణాతుల బృందాన్ని చర్యల్లో భాగం చేసినట్లు సహాయక చర్యలు వేగవంతం అయ్యాయని వివరించారు. రెండు మూడు నెల ల్లో ఎస్ఎల్బీసీ సొరంగ పనులను ప్రారంభించడం తన యొక్క దృఢ సంకల్పమని స్పష్టం చేశారు. ఎస్. ఎల్.బి.సి టన్నెల్ ప్రమాద ఘటన లో టన్నెల్ లో చిక్కుకున్న ఎని మి ది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్వేషణను ము మ్మరం చేసినట్లు రాష్ట్ర నీటిపారు దల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిం చారు. టన్నెల్ లో ఉన్న నీటిని భా రీ పంపులతో బయటికి పంపడం, బురదను తీసివేయడం, ద్వారా డిబిఎం ముందుభాగం చెరుకోను న్నట్లు తెలిపారు. డిబిఎం చివరి భాగాలను గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్లు మంత్రి వివరించారు.రెండు మూడు రోజు ల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయ నున్నట్లు, తిరిగి సోరంగ పనులు రెండు మూడు నెలల్లో ప్రారంభించ నున్నట్లు వివరించారు ఆర్మీ , నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, బోర్డ ర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాట్ మైన ర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్ట ర్స్, రాబిన్సన్ మైనింగ్ ప్రతినిధు లు, మెగా, నవయుగ, కంపెనీల బృందాలు నిరంతరం సమన్వయం తో సహాయక చర్యలు చేపడుతు న్నట్లు, టిబియం మిషన్, శిథిలా లను, బురదను సొరంగంలో ప్రమా ద స్థలం నుండి బయటికి తేవడం జరుగుతుందని, తెలిపారు. ప్రమా దం జరిగినప్పటి నుండి రాష్ట్ర మంత్రులు నిరంతరం సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ సహాయక కార్యక్రమాలు చేపడు తున్నట్లు వివరించారు.
సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బుర ద నీటిని తొలగించే ప్రక్రియను మ రింత స్పీడ్ పెంచారన్నారు. దేశం లోని మైనింగ్ ప్రమాదాలలో నిష్ణా తులైన వారి సేవలను వినియోగిం చుకుంటూ వారి సలహాలు సూచన లు తీసుకుంటూ సహాయక చర్య లు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సహాయక చర్యల్లో దేశంలోని మైనింగ్ రెస్క్యూ సిబ్బంది, ఇండి యా బోర్డర్స్ ఆర్గనైజేషన్ సేవలను వినియోగించుకుంటున్నట్లు,తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రెస్క్యూ టీంలు దృష్టి సారించాయ ని,సహాయక చర్యల్లో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీం లకు వెసులుబాటు కలిపించిందన్నారు. ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి కాలరీస్ అండ్ మైనింగ్ ప్రతినిధుల బృందం, ర్యాట్ మైనర్ సేవలను వినియోగించుకొని పూర్తి ప్రణాళికతో రెండు, మూడు రోజు ల్లో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వాహణ శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నా గర్ కర్నూలు కలెక్టర్ బాధవత్ సంతోష్ జిల్లా టి.ఎస్.ఎస్.పి. డి.సి.ఎల్.సి.యం.డిముషారాఫ్ అలీ, ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ అధికారులు కల్నల్ బ్లాక్ స్మిత్ మెహ్రా, జెపి కంపెనీ ప్రతినిధులు జరుగుతున్న సహాయక చర్యలపై ఉదయం జెపి కంపెనీ బేస్ క్యాం పులోసమీక్ష సమావేశం నిర్వహిం చారు.