Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar Reddy : ఆ ఎనిమిది మందిని సురక్షితంగా రక్షిస్తాం, సైన్యం సహకారం తీసు కుంటాం

–ఎస్ఎల్ బిసి సొరంగం సంఘటన దురదృష్టకరం

–రాష్ట్ర ప్రభుత్వం రిస్క్యూ టీం లతో సర్వశక్తులు ఒడ్డుతోంది

–అవసరమైన వైద్య సేవల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం

–లోపలి బాగంలో వెంటిలేషన్ కు ఇబ్బంది లేదు

–ప్రపంచంలోనే టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ పేరెన్నికగలది

–సంఘటన స్థలం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

Minister Uttam Kumar Reddy :  ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: ఎస్.ఎల్.బి.సి టన్నెల్ లో ఈ తరహా సంఘటన చోటు చేసు కోవడం దురదృష్టకరమని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివా రం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్.ఎల్.బి.సి టన్నెల్ తవ్వకాలలో ప్రమాదం జరి గిందన్న విషయం తెలుసుకుని హు టాహుటిన సంఘటనా స్థలికి చేరు కున్నారు.సంఘటనా స్థలిని పరిశీ లించడంతో పాటు లోపట చిక్కుకు న్న వారిని కాపాడడం కోసం అవ సరమైన చర్యలు తీసుకునేందుకు గాను దోమలపెంటలోని జే. పి గెస్ట్ హౌస్ లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి తెలంగాణా అగ్నిమాపక,రిస్క్యూ టీం డి. జి నారాయణ రావు,ఐ. జి సత్యనా రాయణ నాగర్ కర్నూల్ కలెక్టర్ తో పాటు రాబిన్ సంస్థ కు చెందిన లెన్ మైనార్డ్ తో సమీక్ష సమావేశం నిర్వ హించారు. అనంతరం జరిగిన విలే కరుల సమావేశంలో మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సొ రంగంలో చిక్కుకున్న మిగిలిన ఎని మిది మందిని సురక్షితంగా కాపాడ డం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశ క్తులు ఒడ్డి పని చేస్తుందన్నారు.

అందు కోసం ఇప్పటికే సింగరేణి కి చెందిన రిస్క్యూ టీం లు రంగంలో కి దిగాయని ,భారత ఆర్మీ కి చెంది న రిస్క్యూ టీం లతో తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లా డామని ఈ రాత్రి వరకు ఆ టీం ఇ క్కడికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. అంతే గాకుండా టన్నెల్ వద్ద ప్రమాదాలు సంభవిం చినప్పుడు రంగంలోకి దిగి కాపాడే టీంలతో కుడా మాట్లాడినట్లు ఆ యన తెలిపారు.ఈ మధ్య కాలం లో ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఈ తర హా సంఘటన చోటు చేసుకున్న ప్పుడు రంగంలోకి దిగి ప్రాణా పా యం లేకుండా కాపాడిన టీం ను కుడా రంగంలోకి దింపనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో పాటు ఉన్న త స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను ఎప్పటికప్పు డు సమాలోచనలు చేస్తూ సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు

అగ్నిమాపక డి.జి నారాయణ రా వు ఆధ్వర్యంలో రీస్క్యూ టీం పని చేస్తుండగా ఐ. జి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు సహాయ సహకారాలు అందిస్తున్నా యాన్నారు. ఇప్పటికే వైద్య బృం దం అంబులెన్స్ లను సిద్దంగా ఉం చామన్నారు. నీటిపారుదల శాఖా ధికారులు పరిస్థితులను ఎప్ప టికప్పుడు సమీక్షిస్తూ వారిని కాపా డేందుకు చేపడుతున్న చర్యలను పర్యవేక్షిస్తున్నామన్నారు. అయితే వెంటిలేషన్ కు ఇబ్బంది లేదన్నా రు. టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ ప్రపంచ స్థాయిలో పేరెన్ని కగన్నదన్నారు. లోపట చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడడమే ప్రభుత్వం ముందున్న సవాల్ అని మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు వర్కర్లు ఉన్నారని ఆయ న వివరించారు. వారి వివరాలను ఆయన మీడియా కందించగా వారి వివరాలు ఇలా ఉన్నాయి.

1..మనోజ్ కుమార్ (PE) ఉత్తర ప్రదేశ్
2.. శ్రీనివాస్ (FE) ఉత్తర ప్రదేశ్
3.. సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4.. జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5..సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6.. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7..సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8.. గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్

టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం అకస్మాత్తుగా లోపటికి నీ రు,మట్టి 8 కిలోమీటర్ల మేర రావ డంతో ఈ ప్రమాదం చోటుచేసు కుందని భావించాల్సి ఉందన్నారు
రోజువారీగా పని మొదలు పెట్టినట్లే ఈ ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాలలోనే ఈ సంఘటన ఉత్పన్నమౌడంతో వెంటనే నిర్వాహకులు పనిని నిలి పి వేసి బయటకు రావడంతో పా టు వీలున్నంత వరకు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారన్నారు.
ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ T.B. M ,వద్ద పని మొదలు పెట్టారో అక్కడికి నీరు,మట్టి చేరుతుండడం తో పాటు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మిషన్ మీద ఉన్న వా రు,వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాగలిగారని మిషన్ ముందు భాగంలో ఉన్న వారు అందులో చిక్కుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.