Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttamkumar Reddy: కోదాడ నియోజకవర్గంలో వరద ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఉత్తమ్, ఎమ్మెల్యే

Uttamkumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న నియోజకవర్గాల లోని పలు ప్రాంతాలను సోమవారం భారీ నీటి పారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy) శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి (Padmavathi Reddy)పరిశీలించారు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతిని జాతీయ రహదారిపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు, అలాగే నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.

మున్సిపల్ పరిధిలోని తమ్మర వాగు పై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజులు పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం వరుస చూసిన ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు నార్కట్ పల్లి నల్లగొండ మిర్యాలగూడ వయా గుంటూరు మీదుగా వెళ్లాలని ప్రయాణికులకు వాహనదారులకు సూచించారు త్వరలోనే నేషనల్ హైవే వారితో మాట్లాడి బ్రిడ్జి (bridge) పునర్దించటం జరుగుతుందని తెలిపారు వర్షాలకు దెబ్బతిన్న లేక కూలిపోయిన ఇళ్లకు కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలిపారు అలాగే వర్షాలు కారణంగా చనిపోయిన వారికి ప్రభుత్వం ద్వారా ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని తెలిపారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ (Collector Tejas Nandalal) పవర్ ఐపీఎస్ ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.