Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ministerkomatireddy : మాది స్కీంల ప్రభుత్వం, వాళ్ళది స్కాంల కుటుంబం

--పేద ప్రజలకు మెరుగైన వైద్యం ప్రభుత్వ బాధ్యత --ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమ కోసం కృషి చేస్తాం --యేడాది కాలంలో దాదాపు రూ. 15 00 కోట్ల ఎల్.ఓ.సీలు, సీ.ఎం. ఆర్. ఎఫ్ లకు చెల్లించాం --ఆరోగ్యశ్రీని పటిష్టపర్చి రూ. పది లక్షలకు పెంచాం --సనత్ నగర్ టిమ్స్ నిర్మాణ పను ల పరిశీనలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మాది స్కీంల ప్రభుత్వం, వాళ్ళది స్కాంల కుటుంబం

–పేద ప్రజలకు మెరుగైన వైద్యం ప్రభుత్వ బాధ్యత
–ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమ కోసం కృషి చేస్తాం
–యేడాది కాలంలో దాదాపు రూ. 15 00 కోట్ల ఎల్.ఓ.సీలు, సీ.ఎం. ఆర్. ఎఫ్ లకు చెల్లించాం
–ఆరోగ్యశ్రీని పటిష్టపర్చి రూ. పది లక్షలకు పెంచాం
–సనత్ నగర్ టిమ్స్ నిర్మాణ పను ల పరిశీనలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రజా దీవెన, హైదరాబాద్: పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యా న్ని అందించడమే లక్ష్యంగా తెలం గాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుం దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సనత్ నగర్ (ఎర్రగడ్డ)లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే తెలంగాణ ఆవి ర్భవ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతు ల మీదుగా సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభిం చేందుకు శరవేగంగా పనులు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి పేద ప్రజ లు రూపాయి లేకున్నా కార్పో రేట్ ను మించిన వైద్యం అందుకు నేలా టిమ్స్ ఆసుపత్రిని మలుస్తామని చెప్పారు.

మేం స్కీంలను అమలు చేస్తూ ప్రజలకు చేరువవు తుంటే బిఆర్ఎస్ పార్టీ స్కాంలు చేస్తూ ప్రజల్లో అబాసుపాలవుతుం దని ఆయన ఎద్దే వా చేశారు. విదే శాల్లో నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం అందించి నట్టే తెలంగాణలో నూ అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం లో ఆర్ అండ్ బి వైద్యశాఖ సమన్వయం చేసుకునేలా నోడల్ ఆఫీ సర్ ను నియమిస్తామని. వచ్చే రెండు మూడు రోజుల్లో రెండు శాఖ ల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు లో చేపట్టాల్సిన కార్యచరణపై రూట్ మ్యాప్ ను రూపొందిస్తామని వివరించారు.

హాస్పిటల్ నిర్మాణం చేయడం అంటే సొంతిళ్లు నిర్మిం చుకున్నట్టేనని అయన అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో కట్టడాలను కడుతున్న మె ఘా సంస్థ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని ఒక దైవకా ర్యంల భావించా లని మెఘా ఇంజ నీరింగ్ సంస్థ సిబ్బందికి మంత్రి సూచించారు.ఇక ఎలక్ట్రిసిటీ సిస్టమ్, ఆక్సిజన్ పైపింగ్ సిస్టమ్, వాటర్ అండ్ డ్రైనేజీ సిస్టమ్స్ ఎక్కడా లోపాలు లేకుండా నిర్మిం చాలని అధికారులకి సూ చించిన మంత్రి. ఒక్కసారి పేషెంట్లు జాయి న్ అయ్యాక లీకేజీలు వస్తే నిర్మిం చిన సంస్థ రెప్యూటేషన్ దెబ్బతిం టుందని నిర్మాణ సంస్థ ను హెచ్చ రించారు.హాస్పిటల్ లో పేషెంట్ల ప్రాణాలను నిలబెట్టే ప్రధా నమైన ఎమర్జెన్సీ పికప్, డ్రాప్ పాయింట్స్ మరింత విశాలంగా ఉండే లా నిర్మించాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఎమర్జెన్సీ వార్డులో పెషెంట్లు వెయిటింగ్ లేకుండా ఉండేలా అడ్వా న్స్డ్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన మంత్రి.. గొల్డెన్ అవర్ లో పేషెంట్ కు తగిన చికిత్స అందితే ప్రాణాలు రక్షిం చినట్టే తెలిపారు. రెండు మూడు రోజుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు, వైద్య పరికరాల కూర్పుపై వైద్యశా ఖ అధికారులతో ఆర్ అండ్ బీ ఇంజనీర్ల సమావేశమవుతారని తెలిపిన మంత్రి.. బ్లా క్-ఏ ఇప్పటికే స్లాబ్ వర్క్ పూర్తయ్యిందని టైలిం గ్, సీలింగ్, ప్లాస్టరిం గ్ వర్కులు నడుస్తున్నాయని, బ్లాక్ – బీ 5వ అంతస్తూ స్లాబ్ పడితే పూర్తవు తుంది, బ్లాక్ – సీ పనులు చివరి దశలో ఉన్నట్టు తెలిపారు.

హాస్పి టల్ వచ్చే రోగుల్లో మానసిక ఆనం దాన్ని కలిగించేందుకు ప చ్చని గ్రాస్ గార్డెన్ తో పాటు రంగు రంగుల పూల మొక్కలు నాటాల ని సూచించారు. పేషేంట్ల అటెండెంట్లు ఉండేందుకు అధునాతన సౌకర్యా లతో ధర్మశాల నిర్మించడంతో పా. టు అక్షయపాత్ర సంస్థతో ఒ ప్పందం చేసుకున్నామని. వారికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అధునాతన హాస్టల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఫార్మ సీ రూం, ఓపీడీ రిజిస్ట్రేషన్ రూంల ను కంప్యూటరించి పేషెంట్లకు వేగంగా అయిపాయింట్లు మెంట్లు దొరికే లా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రేడియోలజీ, ఎమర్జెన్సీ వార్డులు, ఎమ్.ఆర్.ఐ, సిటీ స్కాన్ రూంల ను పేషెంట్లకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతు న్నామని చెప్పారు. ఇదే కాకుండా, అల్వాల్ టిమ్స్ కు స్థల ఇబ్బందు లు ఉంటే ఎన్ఓసీ ఇప్పించానని తెలిపిన మంత్రి ఎల్.బి నగర్ టిమ్స్ నిర్మాణాన్ని వేగవ తం చేస్తామని వివరించారు.

ఇక వచ్చే రెండు, మూడు నెలల్లో గోషా మహల్ స్టేడియంలో ఉస్మా నియ నయా దవాఖాన నిర్మాణం చేపడు తున్నామని, నిమ్స్ దవా ఖాన ను వీలైనంత త్వరగా అందుబాటు లోకి తెచ్చేలా పనులను స్పీడప్ చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, సీఈ రాజే శ్వర్ రెడ్డి, ఎలక్రిసిటీ విభాగం సీఈ లింగారెడ్డి తో పాటు ఎస్ఈ విశ్వ కుమార్ ఈఈలు, మెఘా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Ministerkomatireddy