Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ministerkomatireddyvenkatreddy : కీలక అప్డేట్, రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ కు అన్ని అనుమతులు

కీలక అప్డేట్, రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ కు అన్ని అనుమతులు

ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: హైదార బాద్ కు మరో మణిహారం రీజినల్ రింగ్ రోడ్డుకు సం బంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తా మని, అన్ని క్లియరెన్స్ లు వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టి కి తీసుకువె ళతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తె లంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం డిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అనం తరం మీడియాతో మాట్లాడారు.

సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ వరకు ఆర్ఆర్ఆర్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. దాదాపు 95 శాతం భూసేకరణ కూడా పూర్త యిందని, రూ. 1000 కోట్లతో 12 ఆర్వోబీలు కూడా మంజూ రు చేశారని తెలిపారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదా రి ఆరు లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసు కోవాలని నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుం చి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యమవుతోందని, దీంతో గుడిమ ల్కాపూర్ నుంచి విజయవాడకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీ గా విభజించి టెండర్లు పిలవాలని అధికారులకు గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని వెల్లడిం చారు.

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడిం చారు. అనంతరం కేంద్ర పౌరవిమానయా నశాఖ మంత్రి రామ్మోహన్ నాయు డు తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. మం త్రితో పాటు ఆర్ & బీ శాఖ స్పెషల్ ఛీఫ్, సెక్రెటరీ, స్పెషల్ సెక్రటరీ, ఎన్.హెచ్. ఉన్నతాధికారుల బృందం ఉంది. మొదట నితిన్ గడ్కరి తో సమావేశ మైన మంత్రి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రహ దారులు, రీజి నల్ రింగ్ రోడ్డుపై విన్నవించారు. రీ జినల్ రింగ్ రోడ్డు కు కేంద్ర క్యాబినే ట్ ఆమోదం లభించేలా చూడాలని మంత్రి ఆపిల్ చేయగా రెండు నెల ల్లో రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్వ పనులు పూర్తి చేసి కొత్త పనులు ప్రారంభించేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్రమంత్రికి కోమటిరెడ్డి సమ ర్పించిన వినతిపత్రం వివరాలు ఇలా..

— రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం,
— శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (NH-765),
— పర్వత్ మాల పథకం క్రింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీ
— సిఆర్ఐఎఫ్ సేతుబంధు పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీ
— NH 65 లోని హైదరాబా ద్-విజ యవాడ విభాగం 6 లేనింగ్, NH 163 లోని హైదరాబాద్ మన్నెగూ డ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేడం వంటి 5 ప్రధాన అంశాలతో కూడిన అభ్యర్ధ లను నితిన్ గడ్కరీకి మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి అందించారు.

1. రీజినల్ రింగ్ రోడ్డు (RRR)

* రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణ స్థితిగతులను నితిన్ గడ్కరీకి వివరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

RRR ఉత్తర భాగంలో.. గతేడాది రూ. 7,100 కోట్లతో 5 ప్యాకేజీ లుగా పిలిచిన ఉత్తర భాగం టెండర్ల తేదీలను పొడగించిన విష యంపై చర్చించిన మంత్రి.

— ఉత్తర భాగానికి సంబంధించి PPPAC (Public Private Part nership Appraisal Com mit tee)& కేబినెట్ ఆమోదంపై గడ్కరీ ని కోరిన మంత్రి.

— ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సం తకం మరియు అటవీ అనుమతు లను వేగవంతం చేయాలని అభ్య ర్ధించిన మంత్రి.

RRR దక్షిణ భాగంలో … చౌటు ప్పల్ (NH 65 పై) – అమంగల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి (NH 65 పై) మీదుగా నిర్మిస్తున్న RRR ద క్షిణ భాగం యొక్క అలైన్ మెంట్ ను ఫైనలైజ్ ప్రకటన చేస్తూ ఆమో దం తెలుపవలసిందిగా కోరిన మంత్రి.

హైదరాబాద్-శ్రీశైలం (NH-76 5) ఎలివేటెడెట్ కారిడార్ …

— హైదరాబాద్-శ్రీశైలం (NH-765) 187 కిలోమీటర్ల రహదారిలో 62 కిలోమీటర్ల ఎలివేటెడెట్ కారిడార్ నిర్మాణంపై గడ్కరీని కోరిన మంత్రి

— శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మా ర్గంలో 62 కిలోమీటర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళుతుండ టంతో అటవీ అనుమతుల కార ణంగా అభివృద్ధి జరగలేదని వివ రించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

–దక్షిణ కాశీగా, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం కేంద్రప్రభుత్వం హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ను ప్రతిపా దించిన విషయాన్ని గడ్కరీకి గుర్తు చేసిన మంత్రి.

–ఇదే విషయమై 27.06.2024 రో జున సర్వే పూర్తి చేసి రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ మోర్త్ కు స మర్పించడం.

— మోర్త్ (MoRTH – Ministry of Road Transport and High ways) సూచనల మేరకు టైగర్ రిజర్వ్ అధికారుల అనుమతి కూ డా కోరడం.

–అనంతరం మోర్త్ సూచనల ప్ర కారం 17.12.2024 నాడు అటవీ అనుమతుల కోసం PARIVESH- 2.0లో దరఖాస్తు చేయడం తదుప రి పురోగతిపై గడ్కరీకి వివరించిన మంత్రి.

–వీటన్నింటి దృష్ట్యా శ్రీశైలం ఎలివే టెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌ ప్రగతిలో ఆల స్యం జరగకుండా వేగంగా అనుమ తులు మంజూరు చేయాలని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

— సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచెందుకు కేంద్రమంత్రి సాను కూలంగా స్పందించించినట్లు తెలి పిన మంత్రి.

పర్వత్ మాల పథకం కింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీకై….

–కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రదే శాలకు రోప్‌వే కనెక్టివిటీ అభివృద్ధి కోసం పర్వతమాల పథకాన్ని ప్రవే శపెట్టిందని అయితే, ఈ పథకం లో తెలంగాణకు ఇప్పటి వరకు ఎటు వంటి ప్రాజెక్టులు మంజూరు కాలేద ని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

–పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాన్ని అందిం చేం దుకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసిం హస్వామి ఆలయానికి (2 కి.మీ) రోప్‌వే, (2) భువనగిరి కోటకు (1 కి.మీ) రోప్‌వే, (3) నల్లగొండ పట్ట ణంలోని హనుమాన్ కొండ (2 కి.మీ) రోప్‌వే, (4) నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా (5 కి.మీ) నాగా ర్జునకొండను కలుపుతూ రోప్‌వే. (5) మంథనిలోని రామగిరి కోట (2 కి.మీ) రోప్‌వే వంటి 5 రోప్ వే ప్రాజె క్టులను తెలంగాణకు మంజూరీ చేయాలని కోరిన మంత్రి.

సేతుబంధన్ పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీకై …

–CRIF-సేతుబంధు పథకం క్రింద రూ. 887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాసిన లేఖ (26.06.2024) విషయాన్ని నితిన్ గడ్కరీకి గుర్తు చేసిన మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి.

–ఇప్పటికి ఆ అభ్యర్ధనలు పెండింగ్ లో ఉండటంతో తాను మరో అభ్య ర్ధన లేఖను నితిన్ గడ్కరీకి లేఖను అందించిన మంత్రి.

— 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేతుబంధన్ పథకం కింద ప్రతిపాది త 12 పనులను మంజూరు చేయా లని కోరారు
— హైదరాబాద్-విజయవాడ NH 65 ను 6 లేన్లుగా విస్తరణకై వినతి

–రెండు తెలుగు రాష్ట్రాల రాజధా నుల మధ్య కీలకమైన NH-65పై ట్రాఫిక్ 40,000 ప్యాసింజర్ కార్ యూనిట్ గా ఉండటం వలన అనే క ప్రమాదాలు జరుగుతున్న దృ ష్ట్యా NH-65 ని 6 లేన్లుగా విస్త రిం చాలని నితిన్ గడ్కరీకి వివరించిన మంత్రి.

— NH-65ని (హైదరాబా ద్-విజ యవాడ) 6 లేన్లుగా నిర్మిం చేందు కు ఉద్దేశించిన DPR తయారీని వేగ వంతం చేయడంతో పాటు ప్రా జెక్టు ను మంజూరు చేయాలని కోరిన మంత్రి.

–అంతేకాదు, NH-163 లోని హైదరాబాద్ నుండి మన్నెగూడ రహ దారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భేటి సందర్భంగా కోరిన మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అనంతరం మంత్రి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో సమావేశమయ్యారు.

— మామునూరు ఎయిర్ పోర్ట్ మంజూరీపై కేంద్రమంత్రి రామ్మో హన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
–భూసేకరణకు 205 కోట్ల రూపా యలను మంజూరీ చేసి భూసేక రణ చేస్తున్న విషయం రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లిన మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

–వీలైనంత త్వరగా మామునూర్ ఎయిర్ పోర్టును పూర్తి చేసేలా చూ స్తానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి

— దశాబ్ధ కాలంగా పెండింగ్ లో ఉ న్న ఎయిర్ పోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే కార్యా రూ పం దాల్చింది.

— మామునూరు ఎయిర్ పోర్టు కు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు

–మామునూరు ఎయిర్ పోర్టు కో సం జిఎంఆర్ నుంచి NOC తీసు కున్నాం

— రెండున్నరేళ్లలో మామునూర్ ఎ యిర్ పోర్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు

–మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అ భ్యర్ధనకు స్పందించిన రామ్మోహన్ నాయుడు త్వరలోనే భద్రాద్రి కొత్త గూడెం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన IMD సర్వే పూర్తి చేసి ఫీజిబిలిటీ స్టడీ చేస్తామని హామీ ఇచ్చారు.

–ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామా బాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టులకు సర్వే చేయనున్న ఎయి ర్ పోర్ట్ అథారిటీ.

–మామునూర్ ఎయిర్ పోర్టు కి 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుంది.

కేంద్ర మంత్రులను కలిసిన వారిలో మంత్రితో పాటు ఖమ్మం ఎంపీ రా మ సాయం రఘురాం రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూర్ రఘు వీర్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరి చందన ఉన్నారు.