Ministerkomatireddyvenkatreddy : హైవే ప్రమాదాలను నివారణకై డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
--రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
హైవే ప్రమాదాలను నివారణకై డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
–రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
Ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన, చిట్యాల: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొద టిసారిగా నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందు కు గాను డ్రైవర్లకు దాబాల వద్ద ఉచిత కంటి పరీక్షలతో పాటు, కళ్ల ద్దాల పంపిణీ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.ఆదివారం ఆయన నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వట్టిమర్తి వద్ద ఉన్న డూన్ పంజాబీ ధాబాలో రహదారి భద్రత మాసో త్సవంలో భాగంగా డ్రైవర్లకు ఉద్దే శించి ఏర్పాటుచేసిన ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రపంచంలోనే భారత దేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహ దారిపై ప్రతిరోజు 70 నుండి 80 వేల వాహనాలు తిరుగుతాయని ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా ఎవరు చేపట్టని విధంగా వినూత్నంగా డ్రైవర్లకు దాబాలోనే కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే తక్షణమే అద్దాలు ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నదని, ఇందుకు ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ శరత్చంద్ర పవార్లను అభినందించారు.
రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కుటుం బాలు వీధిన పడతాయని, ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్ర మాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశా రు. ముఖ్యంగా గంటల తరబడి దూరప్రాంతాల నుండి భారీ వాహ నాలను నడిపే డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల, అలాగే సమయా భావం, సరై న డబ్బులు లేకపోవడం వంటి కారణాలవల్ల కంటిచూపును నిర్లక్ష్యం చేస్తారని, ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ,ఈ ప్రమాదాలను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
రహదారులపై ప్రమాదాలు తగ్గించే బాధ్యత డ్రైవర్ల చేతుల్లోనే ఉంద ని అన్నారు. చిట్యాల, నార్కట్పల్లి పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరి గేందుకు యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయని, విజయవాడ- హైదరాబా ద్ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా మార్చేందుకు మే చివ రినాటికి టెండర్లు పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్ల డించారు. రెండు సంవత్సరాలలో ఆరు లైన్ల పనులను పూర్తి చేస్తా మని తెలిపారు. వాహనాల డ్రైవర్లతో పాటు, ఆర్టీసీ డ్రైవర్లు తప్పని సరిగా సీట్ బెల్ట్ ధరించాలని ,ట్రాఫిక్ భద్రతలను పాటించాలని, సిగ్న ల్ వద్ద నియమాలను తూ.చా తప్పకుండా అమలు చేయాలని ఆయన సూచించారు.
వట్టిమర్తి దగ్గర ఏర్పాటు చేసినట్లుగానే కోదాడ, మిర్యాలగూడ ల లో సైతం ఇలాంటి ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు రహదారి నియమాలను పాటిస్తే 70% ప్రమాదాలను నివా రించవచ్చని చెప్పారు. ప్రమాదాల నివారణకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలకు ప్రతీక్ ఫౌండేషన్ తర పున అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు .ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టడం వల్ల ప్రజలను కాపాడిన వారు అవుతారని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ లారీ డ్రైవర్లు దూర ప్రాంతా ల నుండి ప్రయాణం చేస్తూ గంటల తరబడి వాహనాలు నడుపుతుం టారని, సమయం లేకపోవడం, అలాగే సరైన పరీక్షలు నిర్వహించు కోనేందుకు అవకాశాలు లేకపోవడం ,డబ్బు లేకపోవడం వంటి కార ణాలవల్ల డ్రైవర్లు దృష్టిలోపంతో వాహనాలు నడిపినప్పుడు ప్రమా దాలు జరుగుతాయని ,దీనివల్ల డ్రైవర్ల ప్రాణాలతో పాటు, ఇతర ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలను నివారించి వారి ప్రాణాలు కాపాడేందుకు, అలాగే ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వట్టిమర్తి వద్ద లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం తో పాటు, గంటలోపే అద్దాలను సైతం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, దేశంలో ఏ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండరని, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకో వాలని ఆమె కోరారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రహదారి భద్రత మాసో త్సవంలో భాగంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహన డ్రైవర్లు, దూర ప్రాంతాల నుండి వచ్చే వారి ఉపయోగార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. డ్రైవర్ల దృష్టిని పెంచడం వలన ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. 2023 లో నల్గొండ జిల్లాలో 58 హాట్స్పాట్ కేంద్రాలు ఉండగా, ఈ సంవత్సరం జిల్లా యంత్రాం గం తీసుకున్న చర్యల వల్ల వాటిలో 17 తగ్గించామని, ఈ సంవత్స రం మరింత పటిష్టంగా కృషిచేసి రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని అన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, రహదారి భద్రత నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని కోరారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 800 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయని ఆయన తెలిపారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ దూరం చూ పు ,దగ్గర చూపు సమస్యలు ఉండడం ,నిరంతరం విధుల్లో ఉంటూ సమయం లేక కళ్లను పరీక్షించుకోలేక, దృష్టిలోపం వల్ల డ్రైవర్లు ప్ర మాదాలకు గురవుతున్నారని, ఇలాంటి ఉచిత కంటి వైద్య పరీక్షల వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, ఇది ఒక మంచి అవకా శం అని అన్నారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవని, వీటన్నింటిపై కేంద్రమంత్రి తో చర్చించి బ్లాక్ స్పాట్ ను గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి హైదరాబాద్- విజ యవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మార్చడమే కాకుండా, పనులను ప్రత్యేకించి బ్లాక్ స్పాట్స్ను మూసివేసే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు.నల్గొండ జాతీయ రహదారిపై డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలు నిర్వహించడం రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. డ్రైవర్లు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా రవా ణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి కూడా మాట్లాడారు. డి ఎం హెచ్ ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆర్టీవో లావణ్య,ఆర్డిఓ అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి ,చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటి రెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, నల్గొండ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతి నిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.