కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య,’ సన్న బియ్యం’ నిరుపేదల ఆత్మగౌరవ పథకo
Ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన నల్ల గొండ ( కనగల్): సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథ కమని,చరిత్రలో నిలిచిపోయే పథకమని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు.రాష్ట్ర ముఖ్యమం త్రి ఏ. రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారం భించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం, జి . ఎ డవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతేకాక గ్రామంలో నాలుగు కోట్ల 63 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు.ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద లు సైతం పెద్దల మాది రిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకు వచ్చిందని తెలిపా రు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. 3 కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు.
5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. కనగల్ మండలంలో 20 ఏండ్ల కింద ఒక్కొక్కటి లక్ష రూపా యలతో తాను 500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ,ఇప్పుడు మళ్లీ ఐదు లక్ష లతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు.ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పిజి కనెక్షన్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నా రు. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు 4000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
గత ప్రభు త్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకె ళ్లిందని, ఎస్ఎల్బిసిని పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వ చ్చిన తర్వాత 4518 కోట్లు బడ్జెట్లో కేటాయించామని ,ఎస్ఎల్బీసీ టన్నెల్ మిషన్ చెడిపోతే అమెరికా నుండి తెప్పించి బాగు చేయించి పనులు మొదలుపెట్టినప్పటికీ దురదృష్టవ శాత్తు అటు వైపు నుండి టన్నెల్ కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయాయని, సంవత్స రం లోగా టన్నెల్ పూర్తి చేస్తామని తెలిపారు.
కనగల్ మండలంలో 80 కోట్ల రూపా యలతో రోడ్ల పనులు చేపట్ట డం జరిగిందని, అన్ని గ్రామాలలో డ్రై న్లు, రోడ్లు వేయిస్తున్నామని, ప్రతి గ్రామంలో డ్రైన్లు వేశాకే రోడ్లు వేస్తు న్నామని చెప్పారు.జి ఎడ వెళ్లి చెరువు అలుగు గండి మరమ్మతుకు కో టి 30 లక్షల రూపాయ లను మంజూరు చేయడం జరిగిందని వారం రోజుల్లో పనులు ప్రారం భిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువ తకు రాజీవ్ యువ వికాసం అనే మరో అద్భుత పథకం తీసుకువ చ్చిందని , ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 వ రకు ప్రభుత్వం గడువు పొడిగిం చిందని ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల వరకు స్వయం ఉ పాధి పొందేందుకు అవకాశం ఉందని, అందువలన నిరుద్యోగ యు వతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తమ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల ను ఇప్పటివరకు భర్తీ చేసిందని, ఇందిరమ్మ ఇండ్ల కు పేదలను గు ర్తించాలని ఆయన కోరారు. కనగ ల్ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జ రిగిందని ,పిల్లల్ని బాగా చది వించాలని ,ఆరోగ్యంగా ఉండాలని, ఏడవల్లి గ్రామాన్ని దత్తత తీసు కొని అభివృద్ధి చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 7న బక్కతాయికుంట, నర్సింగ్ బ ట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కు శంకు స్థాపన చేస్తున్నామని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కా ర్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు దారులు, రెసిడెన్షియల్ పాఠశాల లు, పాఠశాల,హాస్టల్ విద్యార్థులు, అందరికీ సన్న బియ్యం పంపిణీ చే సేందుకు రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని, రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యాన్ని ప్రోత్స హించడంలో భాగంగా గ్రేడ్ ఏ ధా న్యాన్ని 2320 రూపాయలు క్విం టాలకు చెల్లించి కొంటున్నదని, అ లాగే 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని తెలిపారు.
సన్న బియ్యం ఉత్పాదన తక్కువగా ఉన్న ప్పటికీ రైతులు సన్న ధా న్యం ఎ క్కువగా పండించినప్పుడే సన్న బి య్యం పంపిణీకి అవ కాశం ఉం టుందని తెలిపారు. సన్న బియ్యం వల్ల వివిధ రకాల లా భాలు ఉన్నాయని, బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ స్థాయికి తీసుకురావ చ్చని, అలాగే సులభంగా జీర్ణం అయ్యేందుకు సన్న బియ్యం ఉప యోగపడతాయని చెప్పారు.
అంతకుముందు మంత్రి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించారు. అంతేకాక 28 లక్షల రూ పాయలతో నిర్మించనున్న మూ డు సిసి రోడ్లపనులకు, 3 కోట్ల45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ నున్న 7 నూతన గ్రామీణ రహదా రుల పనులకు, 70 లక్షల రూపా యలతో చేపట్టే ఒక రోడ్డు నిర్వ హన పనులకు, మరో 20 లక్షల రూపాయల వ్యయంతో డిఎంఎఫ్టీ కింద చేపట్టనున్న ఒక పనికి శంకు స్థాపన చేశారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, అనూ ప్ రెడ్డి తదితరులు మా ట్లాడారు. నల్గొండ ఆర్డీవోవై. అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, మార్కె టింగ్ ఎడి ఛాయాదేవి, డిసిఓ ప త్యా నాయక్, పంచాయతీరాజ్ ఈ ఈ గిరిధర్, తదితరులు కా ర్యక్రమం లో పాల్గొన్నారు.