Ministerkomatireddyvenkatreddy: పోలీస్ సామాజిక కార్యక్రమాలు అభినందనీయం
-- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి
పోలీస్ సామాజిక కార్యక్రమాలు అభినందనీయం
— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: శాంతి భద్రతల తో పాటు, సామా జిక కార్య క్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ శాఖను అభినందించారు.జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వ ర్యంలో శనివారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వ హించిన మెగా జాబ్ మేళాకు ఆ యన ముఖ్యఅతిథిగా హాజర య్యారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన జాబ్ మేళాలో కనీసం 30 వేల బేసిక్ పే నుండి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషమని అన్నారు. పోలీసులు 24 గంటలు పని చేసే ఉద్యోగులుగా ప్రజల భద్రతతో పా టు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ మని తెలిపారు.
ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పోలీస్ తరఫున ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహిం చడం జిల్లాలో మొదటిదని అన్నారు.ఈ జాబ్ మేళాలో ఉ న్నత చదు వులు చదివిన వారు కూడా ఉద్యో గాల కోసం వచ్చారని అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరో జాబ్ మేళాను త్వర లోనే నల్గొండ లో ఏర్పాటు చేస్తామన్నారు.
మాదక. ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో మిషన్ పరివర్తనను అమలు చే యడం, అలాగే ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమన్నారు. ప్రతీక్ ఫౌం డేషన్ ద్వారా ఇలాంటి సా మాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అం డగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా జాబ్ మే ళా లో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజే శారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మా ట్లాడుతూ మెగా జాబ్ మేళాలో ఉ ద్యోగాలు పొందిన వారు మొ దటిసారి వేతనం తక్కువగా ఉన్న ప్ప టికీ నిరాశపడవద్దని, అను భవం కోసం కృషి చేయాలని,తాను కూ డా మొదటి సారి 18000 / -రూపాయల ఇంటర్న్షిప్ తో బొంబాయి లో పని చేశానని తెలిపారు.ఎంత దూరంలో ఉద్యోగం వచ్చినా పని చేయాలని, భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందేందుకు ఇది ఉ పయోగపడుతుందన్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 112 కంపెనీ లు వచ్చాయని, సుమారు 2500 ఖాళీలు ఈ జాబ్ మేళాలో భర్తీ చేయనున్నామని, 4,000 మంది అభ్యర్థులు ఇప్పటివరకే రిజిస్ట్రే షన్ చేసుకున్నారని తెలిపారు.ఇప్పటివరకు ఎక్కువగా 45 వేల జీతానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
యువత సంఘవిద్రోహ శక్తులుగా తయారు కాకుండా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించా లన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారు మొ దటి ఉద్యోగం అని తేలికగా తీసు కోకుండా, కష్టపడి పని చేయా లని ,రానివారు నిరాశ పడవద్దు అని తెలిపారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం యువతేజం అనే కా ర్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ ను ఏర్పాటు చేశా మని చెప్పారు .జాబ్ మేళాలో హాజరైన వారం ద రికీ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భోజన సదుపా యం కల్పించడం పట్ల ఆయన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డికి కృతజ్ఞతలు తెలి పా రు.ఏఎస్పీ మౌనిక వందన సమర్పణ చేయగా, డీఎస్పీ శివరాంరెడ్డి, జాబ్ కో-ఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.