MinisterKomatireddyVenkatreddy : ఇప్పుడైనా ఎప్పుడైనా నల్లగొండ అభివృద్దేనా మొదటి కర్తవ్యం
-నల్లగొండ రింగ్ రోడ్డు పనుల్లో వే గం పెంచండి, రింగ్ రోడ్డు ఓ గేమ్ చేంజర్ --అభివృద్ది కోసం ముందుకొచ్చి భూములిచ్చిన వారి త్యాగం గొప్ప ది --వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయండి --జిల్లా కలెక్టర్,ఆర్ అండ్ బి,రెవె న్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి -- రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
MinisterKomatireddyVenkatreddy: ప్రజా దీవెన, హైద రాబాద్: నల్లగొండ పట్టణ రింగ్ రోడ్డు పై డా.బి.ఆర్ అంబే డ్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టో గ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,NHAI రీజినల్ ఆఫీస ర్ కృష్ణ ప్రసాద్,ఆర్డీవో అశోక్ రెడ్డి, పి.ఎస్ చంద్ర మోహన్,ఆర్ అండ్ బి ఎస్.ఈ ధర్మారెడ్డి,డి.ఈ ము రళి,డిప్యూటీ తహశీల్దార్ శివకు మార్,జూనియర్ అసిస్టెంట్ వెంక టేశ్వర్లు పా ల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధిలో ఈ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ కాబోతుంది. భూములు ఇచ్చేందుకు రైతులు, ప్లాట్ ఓనర్స్ ముందుకు వచ్చారు. అభి వృద్ది కోసం ముందుకు వచ్చి భూ ములు ఇచ్చిన వారి త్యాగం గొప్ప ది.వారికి నా హృదయ పూ ర్వక ధన్యవాదాలు.వారి ఖాతా ల్లో వెంటనే డబ్బులు జమ చేయండి. ఇప్పుడైనా,ఎప్పుడైనా నల్గొండ అభివృద్దే నా మొదటి కర్తవ్యం. జి ల్లా కలెక్టర్,ఆర్ అండ్ బి,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు.
పాన్ గల్,కొత్తపల్లి, అర్జల్ బావి, మర్రిగూడ ప్రాంతాల్లో భూసేకరణ పూర్తయిందని, భూ సేకరణ డబ్బు లు చెల్లించాల్సి ఉందని అట్లాగే న ల్గొండ అర్బన్,మామిళ్ళగూడ ప్రాం తాల్లో భూసేకరణ పూర్తి చేసి డబ్బు లు భూమి కోల్పోయిన వారి ఖాతా ల్లో జమ చేసేందుకు ఖాతాల వివ రాలు సేకరించామని మంత్రికి అధి కారులు వివ రించారు.
భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేసే ఏర్పా ట్లు చేయాలని NHAI రీజినల్ ఆఫీ సర్ కృష్ణ ప్రసాద్ ను మంత్రి ఆదేశిం చారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వ హిస్తానని, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. భూములు కోల్పోతున్న వారి ఖాతా లో ఖచ్చితంగా వెంటనే డబ్బులు జమ కావాలని,క్షేత్ర స్థాయిలో ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకతో వ్యవహరించా లని మంత్రి కోమటి రెడ్డి జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అధికా రులకు సూచన చేశారు.