బిఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో బొందపెట్టారు
–ఆ పార్టీని, నేతలను తాము గు ర్తించడం లేదు
–భవిష్యత్తులో మాకు ప్రధాన పోటీ బీజేపీయే
–అధికారంలో ఉన్నప్పుడు ప్రాజె క్టుల పేరుతో బిఆర్ఎస్ దోచుకుంది
–నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు
–కేటీఆర్ పర్యటనపై మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజం
Ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన, నల్ల గొండ బ్యూరో: అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎ స్ పార్టీని ప్ర జలు ఎప్పుడో బొంద పెట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంక ట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట పర్యటనపై తీ వ్రస్థాయిలో మండిపడ్డారు. నల్లగొం డ లోని కలెక్టరేట్ లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ కేటీఆర్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని తండ్రి చాటు కొడుకని ఎద్దేవా చేశారు.
రాజకీయాల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.రేవంత్ రెడ్డి రాజకీయాలలో అంచలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి వచ్చాడని అన్నారు. కెసిఆర్ దొంగ దీక్షలు చేసి తెలం గాణ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. తెలంగాణ వ చ్చిన తర్వాత దళితుడిని సీఎం చే స్తానని తానే సీఎం అయ్యాడని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల త్యా గాలు చూసి సోనియాగాంధీ తెలం గాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్ర జలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని, 11 స్థా నాలలో డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవ చేశారు. బిఆర్ఎస్ పార్టీ నేత లకు రాహుల్ గాంధీ, సోనియాగాం ధీ లను విమర్శించే అర్హత లేదని అన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దో చుకుందని ధ్వజమెత్తారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఫోన్ టాపరింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ ల ను దేశానికి రప్పిస్తున్నారని అన్నా రు. వారు వచ్చిన తర్వాత బిఆర్ ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ పరార్ అవుతారని, కెసిఆర్, కేటీ ఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు జైలుకెల్లాక తప్పదన్నారు.
బిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి వేల కోట్లకు పడగలేత్తాడని విమర్శించారు. కేటీఆర్ సూర్యాపేటకు వచ్చు డు దండగని ఎద్దేవ చేశారు.బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడో ప్రజల విశ్వా సం కో ల్పోయిందని, కెసిఆర్ కేటీఆర్ ల మాటలు ఎవరు నమ్మడం లేద న్నా రు. గత ఎన్నికల్లో జగదీష్ రెడ్డి దో చుకున్న సొమ్ముతో కొద్ది పాటి తేడా తో గెలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సేక్యులర్ పార్టీ అని పేర్కొ న్నారు.
సామాజిక న్యాయం కాం గ్రెస్ పార్టీతోనే సాధ్య మైందని అన్నారు. దీంతో ఏఐసిసి అధ్యక్ష పదవి మల్లికార్జున్ ఖర్గే కు, పిసిసి అధ్యక్ష పదవి బీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ పదవి గడ్డం ప్రసా ద్ కు, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కకు వచ్చిందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో కెసిఆర్, కేటీఆ ర్ కు తప్ప ఎవరికీ పదవులు రావ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత అనేక సం క్షేమ పథకాలను అమలు చేస్తుం దని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం విస్మరించిన ప్రాజెక్టులన్నిటికీ నిధు లు కేటాయించి పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలందరికీ ఇందిర మ్మ ఇల్లు కట్టి స్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని స్పష్టం చేశారు.