Minority Gurukula SSC Results :ప్రజాదీవెన, నల్గొండ :రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2024-25 పది ఫలితాలలో మైనార్టీ గురుకుల విద్యార్థినిలు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు. కార్పొరేట్ పాఠశాలలను మించి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సందర్భంగా శుక్రవారం అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు 562 మార్కులు సాధించిన నస్రిన్, (561 ) అసిబా, (560) సమ్రీన్, (553 ) అలీబా, (550) మోఫియా లను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ షాయిన్ షేక్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి అభినందించారు.ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ఆర్ ఎల్ సి విష్ణుమూర్తి, సురేష్, నియాసత్, మైనార్టి ఎక్స్ ప్రెసిడెంట్ హాషమ్, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.