–నిర్వాసితుల జాబితాలోకి 300 బోగస్ కుటుంబాలు
–ప్రభుత్వ భూములు తమనేనం టూ పరిహారాలు
–ప్రైవేటు భూముల్లోనూ చేతివా టాలు
–అక్రమార్కులను విదిలిపెట్టేది లేదన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MLA Anirudh Reddy:ప్రజా దీవెన, జడ్చర్ల: ఉదండాపూర్ లో నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చే ప్యాకేజీ కోసం 300 బోగస్ కుటుం బాల పేర్లు రాయించి పరిహారాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారి ని, ప్రభుత్వ భూములకు అక్ర మంగా పరిహారాలు తీసుకున్న వారెవరినీ జైలుకు పంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy)హెచ్చరించారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు బుధవా రం ఇద్దరు మంత్రులు విచ్చేసిన నేపథ్యంలో ఉదండాపూర్ రిజ ర్వాయర్ వద్ద అనిరుధ్ రెడ్డి తన ను కలిసిన మీడియా ప్రతినిధుల తో మాట్లాడారు. ఉదండాపూర్ (Udandapur) నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇవ్వాల్న నిధుల్లో రూ.45 కోట్లను ప్రభుత్వం మంగ ళవారం రాత్రి నిర్వాసితుల అక్కౌం ట్లలోకి జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నిర్వా సితులు కోరుతున్న విధంగా రూ. 25 లక్షలకు పెంచకుండా రూ.16. 30 లక్షల రుపాయలనే ఖాతాల్లోకి జమ చేసారని బీఆర్ఎస్ నాయకు లు చేస్తున్న విమర్శలను పాత్రికే యులు ప్రస్తావించగా, ఆ 16 లక్షల ప్యాకేజీని కూడా గత రెండేళ్లుగా బీఆర్ఎస్ నాయకులకు చేతకాక పోయిందని విమర్శించారు.
గత బీఆర్ఎస్ (brs)ప్రభుత్వం తన పదేళ్ల ప్రభుత్వకాలంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిపెట్టి వెళ్లిన నేపథ్యం లో ఉదండాపూర్ రిజర్వాయర్ ప నులను రెండేళ్ల తర్వాత చేయా లని ప్రభుత్వం భావించినా తాను పట్టుబట్టి పనులు వెంటనే చేపట్టా లని కోరానని, ఈ కారణంగానే ప్రభుత్వం పనులను ప్రారంభిస్తూ తొలివిడతగా రూ.45 కోట్లు విడు దల చేసిందని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇంకా రూ.800 కోట్ల వరకూ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ పట్ల నిర్వాసితులు ఆనందంగానే ఉన్నా రని అయితే రిజర్వాయర్ ప్రాంతం లో ఫిల్టర్ ఇసుకను తయారు చేసి అమ్ముకొనే వారు, కాంట్రాక్టర్ ను బెదిరించి కమీషన్లు వసూలు చేసు కొనేవారు మాత్రమే ప్రజలను రెచ్చ కొట్టి ప్రాజెక్టు (The project) నిర్మాణాన్ని అడ్డుకో వాలని ప్రయత్నిస్తున్నారని అనిరు ధ్ రెడ్డి ఆరోపించారు. ఫిల్టర్ ఇసుక ను ఎవరూ అమ్ముకోకుండా గట్టి చ ర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. రిజర్వాయర్ ప్రాం తంలో ఫిల్టర్ ఇసుక, గ్రావెల్ అమ్మ కాలను అడ్డుకోవడానికి, కాంట్రా క్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేసే వారిని నిరంతరం కనిపెట్టడా నికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు. ఉదం డాపూర్ రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తామని ఎట్టి పరిస్థితుల్లో నూ రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ నా యకులు చేసిన అక్రమాల కారణం గా ఉదండాపూర్ నాశనమైయిం దని ఆవేదన వ్యక్తం చేసారు. ఆ గ్రామంలో నివాసం లేని 300 మం ది పేర్లను నిర్వాసితుల జాబితాలో చేర్పించారని, వారికి నిర్వాసిత కుటుంబాలుగా ప్రభుత్వం ఇచ్చే రూ.16 లక్షల పరిహార మొత్తం లేదా వారికి ఇచ్చే ప్లాట్ లలో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని ఆ బోగస్ కుటుంబాలతో బీఆర్ఎస్ నాయ కులు ఒప్పందం కుదుర్చుకు న్నా రని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. అలాగే ప్రభుత్వానికి చెందిన భూ ములు కూడా తమవిగా రికార్డుల్లో మార్పించి ఆ భూములకు చెందిన పరిహార మొత్తాలను కూడా అక్ర మంగా తీసుకున్నారని చెప్పారు.
భూమి ఒకరిదైతే పరిహారం ఆ భూమికి సంబంధం లేని ఇతర వ్య క్తుల ఖాతాల్లోకి మళ్లించి ఆ డబ్బు ను కూడా బీఆర్ఎస్ నేతలే స్వాహా చేసారని అనిరుధ్ రెడ్డి ధ్వజమె త్తారు. 300 బోగస్ కుటుంబాలను ఉదండాపూర్ జాబితాలోకి (Udandapur to the list) చేర్చి పరిహారం తీసుకోవాలని ప్రయత్ని స్తున్న వారిని, ప్రభుత్వ భూములు తమవేనంటూ అక్రమంగా పరిహా రం పొందిన వారినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఉదండాపూ ర్ నిర్వాసితుల పేరుతో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చే యాలని తాను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసారు. తాను కమీషన్లు తినే ఎమ్మెల్యేను కానని, అక్రమాలను తాను సహించబోనని పేర్కొన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఐదే ళ్లలోపుగా పూర్తి చేస్తామని అనిరు ధ్ రెడ్డి ప్రకటించారు.