–రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటాం
–ముందస్తుగానే వరి కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తాం
–జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి
MLA Anirudh Reddy: ప్రజా దీవెన, జడ్చర్ల: ఖరీఫ్ సీజన్ (Kharif season)లో రైతులు పండించిన వరి ధాన్యం లో చివరి గింజ వరకూ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉం దని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) స్పష్టం చేసారు. ఇం దిర క్రాంతి పథంకు చెందిన మహి ళా సంఘాల ద్వారా ధాన్యం కొను గోలుకు ఇప్పటి నుంచే ప్రభు త్వం సన్నాహాలు చేస్తోందని వెల్ల డిం చారు. జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ లో బుధవారం ఐకేపీ కి చెందిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ వరి పండించే రైతు లు మధ్యదళారుల చేతుల్లో మోస పోయి తక్కువ ధరలకే తాము పండించిన ధాన్యాన్ని అమ్ము కో కూడదనే లక్ష్యంతో మహిళా సం ఘాల ద్వారా ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ మే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది సన్న ధాన్యం క్వింటాల్ కు రూ.23 20 లతో పాటుగా రూ.500 బోనస్ కూడా ఇస్తోందని చెప్పారు. దొడ్డు ధాన్యా నికి రూ.2300 ధర చెల్లిస్తోం దని తెలిపారు.
గత ఏడాదిలో జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చ ర్ల, నవాబుపేట, బాలానగర్, రాజా పూర్, మిడ్జిల్, ఉర్కొండ మండ లాల్లో రూ.36.33 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోలుకు 40 కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. బాలానగర్ మండంలో చిన్నరేవల్లి, బాలానగర్, హేమాజీపూర్, మదంపల్లి, బాలా నగర్ సింగిల్ విండో సొసైటీ, జడ్చర్ల మండలంలో బాదేపల్లి, నస్రుల్లా బాద్, కోడ్గల్, పెద్దఆదిరాల గ్రామా ల్లోనూ, మిడ్జిల్ మండలంలో భైరంపల్లి, చిలువూరు, దోనూరు, కంచన్ పల్లి, కొత్తూరు, మల్లాపూర్, మసిగుండ్లపల్లి, మిడ్జిల్, మున్న నూరు, వల్లభురావుపల్లి, వెలు గొమ్ముల, వేముల,వాడ్యాల గ్రామా ల్లోనూ, నవాబుపేట మండలంలో చౌడూరు,గురుకుంట,కాకర్లపహాడ్, కారుకొండ, కొల్లూరు, కూచూరు, లింగంపల్లి, లోకిరేవు, నవాబుపేట, ఇప్పటూరు, రుద్రారం, పోమాల్ తదితర గ్రామాల్లోనూ, రాజాపూర్ మండంలో ఈద్గాన్ పల్లి, రాఘవా పూర్, రాజాపూర్, రంగారెడ్డి గూడ గ్రామాల్లోనూ, ఉర్కొండ మండలం లో జకినాలపల్లి, బొంరాస్ పల్లి, ఉర్కొండపేట గ్రామాల్లోనూ వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రభుత్వం ఐకేపీ IKP)ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో తూకాలు సక్రమంగా ఉం టాయని, ఎంఎస్పి ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తారని, అందుకే రైతు లందరూ ఈ కేంద్రాలను విని యో గించుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరా రు. ధాన్యం అమ్మకానికి రావ డాని కి ఇంకా సమయం ఉన్నప్ప టికీ రైతులందరికీ ఈ కేంద్రాలకు సం బంధించిన సమాచారం ఉండా లన్న లక్ష్యంతో ముందుగానే ప్రభు త్వం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ తంగెళ్ల జ్యోతి, మా ర్కెట్ వైస్ ఛైర్మెన్ రాజేంవదర్ గౌడ్, జడ్చర్ల ఎమ్మార్వో, ఎంపిడీఓ, ఎఇ ఓ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సునీత, ఐకేపీ ఏపీ ఎం మాల్యా నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.