–మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
–రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజాదీవెన నల్గొం డ :వరంగల్ లో ఈ నెల 27న తలపెట్టిన బిఆరెస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ కు అన్ని గ్రామాలు, వార్డుల నుంచి బిఆరెస్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి వచ్చి విజ యవంతం చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సభ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సభకు సంబంధించి 13 వ తేదీ నల్లగొండ లక్ష్మి గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
2001 లో కెసిఆర్ ఒక్కడిగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం లక్షల సైన్యాన్ని కదిలించారు. 14 ఏండ్లు శ్రమించి ఢిల్లీ పెద్ద మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారు. తెచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం కెసిఆర్ నే సీఎం కావాలని ప్రజలు గెలిపించారు. ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాం క్షల మేరకు తీర్చి దిద్దారని పేర్కొన్నారు.
సమైక్య పాలనలో కరెంట్ లేక, నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని సొంత రాష్ట్రంలో ఒక్కోక్కటి పరిస్కారం చేస్తూ వచ్చారని అన్నారు.మిషన్ కాకతీయతో సాగునీరు, ఉచిత కరెంట్, పెట్టుబడి సాయంగా రైతు బంధు లాంటివి ఎన్నో చేసి రాష్ట్రాన్ని వ్యవసాయంలో దేశలోనే అగ్రగామిగా తీర్చి దిద్దారు. కరోనా లో సైతం మద్దతు ధరకు ధన్యం కొన్నారు. 2 వేల పెన్షన్, కళ్యణలక్ష్మి, కెసిఆర్ కిట్స్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.
కెసిఆర్ పాలన లో ప్రజలు సంతోషం గా ఉన్న సమయంలో తప్పు డు హామీలతో ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం దన్నారు. కానీ నేటికీ ఆరు గ్యారంటిలతో పాటు ఏది అమలు కాలే దని ఆరోపించారు.15 వేల రైతుభరోసా, 2 లక్షల రుణమాఫీ, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, 4వేల పెన్షన్ ఏది ఇప్పటికి నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదు ఇది కాంగ్రెస్ కరోనా పాలన అని మండిపడ్డారు.
ధాన్యం రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. రైతులను గాలికి వదిలేసారు. జిల్లా మంత్రులు కొనుగోళ్ళ పై ఒక్కనాడు కూడా సమీ క్షా చేయలేదు. రైతులను గాలికి వదిలేసి గాలి మోటార్ల లో తిరుగు తున్నారని విమర్శించారు.నాడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నపుడు ముందే ధాన్యం కొనుగోళ్ల పై రివ్యూ చేస్తూ పగడ్బందీ గా వ్యవహరిం చారు. కానీ నేడు దొడ్డు ధాన్యం కూడా మిల్లులకు అమ్ముకునే దుస్తు తి దాపూరించింది. 1800 లకే అమ్మునుకుంటున్నారని ఆవేదన చెం దారు. సన్న వడ్లకు బోనస్ అడ్రెస్స్ లేదు. ప్రభుత్వ తీరుతో రైతులు సన్నలకు బోనస్ కాదనుకుంటూ మిల్లర్లకే అమ్ముకుంటున్నారు.
జిల్లాకు చెందిన సివిల్ సప్లై మంత్రి ఏమి చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిం చారు. మరో మంత్రి తాగి ఊగడం, గాలిమోటర్ల లో తిరగ డమే సరిపోతుందని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ తీరుతో, మంత్రుల నిర్లక్ష్యం తో నల్లగొండ జిల్లాలో ఒక్కోక్క రైతు వేల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన చెందారు.నేటికీ అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసినా కొనుగోళ్లు స్టార్ట్ కాలే దు.
జిల్లా కలెక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజల, ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎత్తరు. మంత్రి వెంట తిరుగుతూ ప్రజల సమస్య లను గాలికి వదిలేసారని ఆరోపించారు.కలెక్టర్ వ్యవహారం ఇలా ఉంటే ఇతర అధికారులు ప్రజలకు ఏమి జవాబుదారి తనం వహిస్తారో ఆలోచించాలని పేర్కొన్నారు.రైతుల ఇబ్బందులపై వెంటనే ద్రుష్టి సారించాలి. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.లేకుంటే బిఆరెస్ ఆధ్వర్యంలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు.
మిషన్ భగీరథ నీటిపై నిర్లక్ష్యం. చాలా గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని,గ్రామాల్లో సర్పంచ్ లు లేక పాలన కుంటు పడింది. ప్రజల సమస్యలు పట్టించుకునే వారు లేరు. కరెంట్ కోతలు పెరిగి పోయాయి. వీటిపై కలెక్టర్, జిల్లా అధికారులు తక్షణ మే రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజి ఏఎంసి చైర్మన్ బొర్ర సుధాకర్, జేఏసీ నాయకులు జి. వెంక టేశ్వర్లు.. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్ట మల్లి కార్జున రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ ముందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, బొజ్జ వెంకన్న, నారబోయిన బిక్షం, మాజీ జెడ్పిటిసిలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి.. సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, ముఖ్య నాయకులు కంచనపల్లి రవీందర్రావు, లొడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, గాదె రామ్ రెడ్డి,సిరిగిరి వెంకట్ రెడ్డి,జమాల్ ఖాద్రి, జాఫర్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు.. దేప వెంకటరెడ్డి అయితగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, అశోక్,మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య, పిన్నపు రెడ్డి మసూదన్ రెడ్డి యాట జయప్రద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.