Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mla komatireddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురుకులo ఆకస్మిక తనిఖీ

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురుకులo ఆకస్మిక తనిఖీ

ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు పట్ట ణంలో ని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహా లను మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ర్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకు ని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భో జనంలో నాణ్యత లేదంటూ ఏ జెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్య క్తం చేశారు.అన్నం కూరలు సాంబా రు పెరుగు నాసిరకంగా ఉన్నా యం టూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నం మాడిపోవ డంతో వంట మనిషిపై వంట ఏజెన్సీ నిర్వాహకు లపై మండిప డ్డారు. మునుగోడు పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం వండిన అన్నాన్ని, కూరలను, సాంబారు, పెరు గును స్వయంగా రుచిచూసి పరిశీలించారు. అన్నం మాడిపోవడం తో వంట తయారీ ఏజెన్సీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, పెరుగు ఎక్కడి నుండి వస్తు న్నాయని పెరుగు ఇంత పుల్లగా ఎలా ఉంటుం దని అధికారులను ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకొని మెస్ చార్జీలు, కాస్మటి క్ చార్జీలు పెంచిందని, పెంచిన తర్వాత కూడా భోజ నం నాసిర కంగా ఉంటే ఊరుకోమని హెచ్చ రించారు. హాస్టల్లో స్వ యంగా అన్నం కూరలు విద్యార్థినులకు వడ్డించి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకు న్నారు.మరో మారు ఈ హాస్టల్ కి వస్తానని భోజనం నాణ్యతతో లేక పోతే ఊరుకోమని హెచ్చరించారు. ఆయన వెంట కుంభం శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Mla komatireddy