Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Notices : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఝుల క్, ఆ పది మందికి నోటీసులు

MLA Notices : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మె ల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తా జాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లకు నోటీసులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. బీఆ ర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్య దర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీ సుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మె ల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్‌ ఎస్ ఆశ్ర యించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలు గు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదే శించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించిం ది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మం ది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చే రారు.

 

వీరిపై అనర్హత వేటు వేయా లంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఎమ్మె ల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన ప్పటికీ ఈ వ్యవహారం ముందుకు జరగలేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ వేసింది. మొద ట తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహ రి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పిటిష న్ వేసింది. ఆ తర్వాత మరొక ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్. అయితే వీటన్నింటినీ కలిపి ఒకేసారి విచా రణ చేస్తామంటూ ఈ కేసు విచా రణను సుప్రీం కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది. ఓ వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వే టు వేయాలని స్పీకర్‌ను కూడా కో రింది బీఆర్‌ఎస్. దీనిపై స్పందించి న స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మె ల్యేలకు నోటీసులు ఇచ్చారు. లిఖి తపూర్వకంగా సమాధానాలు చె ప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నా రు.