Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: దేవాలయాలు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యే

MLA Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ:రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy)అన్నాడు. అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి (శివాలయం) నూతన కమిటీ ఎన్నికలను ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు శివాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సాధ్యమైన మేరకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు పాలకవర్గం కలిసిమెలిసి ఉండి శివాలయాన్ని జిల్లాలో అగ్రభాగాల నిలిపేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు దేవాలయ కమిటీ చైర్మన్గా ఏటుకూరి రమేష్ కమిటీ సభ్యులుగా మాగి కనకయ్య , శనగపాటి నాగమణి, వెలిశాల హనుమా చారి, చెన్నుపాటి పుల్లయ్య, బండ్ల నాగమణి, నెల్లూరు వెంకటేశ్వర్లు లతో దేవాలయ ఈవో నామ వెంకటచలం ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు (Leader of Congress Party) ముసుకు శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు వెంకటప్పయ్య మాజీ సర్పంచ్ నెల్లూరు లీలావతి దేవాలయం మాజీ చైర్మన్ గంగూరు శ్రీను మహిళా భక్తులు గుండాల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి దేవాలయ ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు