–మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సవాల్
MLA Veeresham: ప్రజా దీవెన, కట్టంగూర్: తెలంగా ణ రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ (KCR), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (jagadeesh reddy)మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యుత్ కొనుగోలు ఆరోపణలపై కమిషన్ ఎదుట నిజా యితీ నిరూపించుకోవాలని నకిరే కల్ శాసనసభ్యుడు వేముల వీరేశం సవాల్ (vemula Veeresham)విసిరారు.ఆదివారం కట్టం గూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ (electricty)కోనుగోలు విషయంలో జరిగిన అవకతకల మీద గత రెండు, మూడు రోజుల నుండి రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోందని చెప్పా రు.గడిచిన 10 సంవత్సరాల్లో తెలం గాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల నిర్వహణ, విద్యుత్ కోనుగోల్ల విష యంలో రూ. 80 వేల కోట్ల అప్పు చేసిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పిందని, ఈ చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని విద్యుత్ కొనుగోళ్లు చత్తీస్ ఘడ్ నుండి చట్ట ప్రకారం జరిగా యని, ఏమైన అవినీతి జరిగిందని భావిస్తే జ్యూడిషియల్(judicial)విచారణ ఆదేశించమని ఒకటికి పది సార్లు అడిగినందునే జష్టిస్ నర్సింహ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేయటం జరిగిం దని గుర్తు చేశారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డిని (jagadeesh reddy)సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న, మీరు నీతిమంతు లైతే ఛత్తిస్ ఘడ్ విద్యుత్ ఒప్పం దం సక్రమమేనని కమిషన్ ఎదుట చెప్పే దమ్ము ఉందా అని వ్యాఖ్యా నించారు. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు సమా చారం చెప్పారని, విచారణ కమీష న్ నవ్వు సహకరించి నీజాయితి ఏంటో నీరుపించుకోవాలనీ సూచిం చారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేసిఆర్ విద్యుత్ సంస్థల్లో చాలా తప్పులు చేశారని, ఈ రాష్టంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని అబ ద్దం చెప్పారని దుయ్యబట్టారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో సబ్ స్టేషన్ లోని లా బుక్ తీస్తే 12 గంటలకు మించి ఇవ్వడం లేదని తేలిందని గుర్తు చేశారు. ఉచి త విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ (Congress party)అని, ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం ని త్రీవమైన సంక్షోభంలో నెట్టారని ఆరోపించారు.కెసిఆర్ , జగదీష్ రెడ్డి లు కమిషన్ ముందు హాజరు కాకుండా ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సూర్యపేట, నల్గొండ ప్రజలు ఒక దోషిగా నిన్ను చూస్తారు కాబట్టి కనుక నువ్వు కమీషన్ ముందు హజరుకావాలని సూచించారు. కమిషన్ ముందు హాజరై నిజాయి తీని వినిపించుకొని ఉమ్మడి నల్ల గొండ జిల్లాకు చెడ్డ పేరు తీసుకు రావద్దని హితవు పలికారు.
ఈ సమావేశంలో కట్టంగూర్ మండల మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, మండల పార్టీ అధ్యక్షు లు పెద్ది సుక్కయ్య, మండల ప్రజా ప్రతినిదులు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
