Mlakomatireddy : పదేళ్లు అధికారమిస్తే ప్రజలకు ఏమి చేశారు
-- ఏడాదిలోనే ఎందుకoత రాద్దాంతం చేస్తున్నారు --పేదలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు --ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
పదేళ్లు అధికారమిస్తే ప్రజలకు ఏమి చేశారు
— ఏడాదిలోనే ఎందుకoత రాద్దాంతం చేస్తున్నారు
–పేదలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు
–ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
ప్రజా దీవెన, చౌటుప్పల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృ త్వంలో నాటి ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఒక్కొక్కటిగా హామీలు నెరవేరు స్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుకుంటుందని, నా రాజకీయ రంగ ప్రవేశమే చేనేత కార్మికుల సమ స్య లతో ప్రారంభమైందని గుర్తు చేశా రు. నాటి ముఖ్యమంత్రి వైయ స్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి నేత న్నలకు రూ. 350 కోట్ల రుణమాఫీ చేయించానని, ఇప్పటి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నేతన్నలకు రుణమాఫీ చేయి స్తానని హామీ ఇచ్చారు.
త్రిప్ట్ పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తామని సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. యాదాద్రి భువ నగిరి జిల్లా మునుగోడు నియోజ కవర్గం చౌటుప్పల్ పట్టణంలో చేనేత మరి యు జౌలి శాఖ ఆధ్వ ర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయో త్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
చేనేత సమస్యలపై పోరాటంతోనే నా రాజకీయ రంగ ప్రవేశం జరి గిందని, చేనేత అన్నలకు నాకు అవినాభావ సంబంధం ఉందన్నా రు.తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాలు, పేదలు, నిరుద్యోగు లు, రైతులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొని కులాలకు, మతాలకు అతీ తంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని,తెలంగాణ ఒక పార్టీ దో, ఒక కుటుంబంతో కాదని, ప్రజా ఉ ద్యమం ద్వార తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నామని గుర్తు చేసారు.
గత పది సంవత్సరాల కాలంలో చేనేత కార్మికులకు న్యాయం జరగ లేదన్నారు. గత ప్రభుత్వాలు చేనే త కార్మికుల్ని చేనేత రంగాన్ని కేవ లం ఓట్ల కోసం వాడుకున్నారే త ప్పా నిజమైన ప్రేమ చూపించలేద న్నారు.గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు వారితో నేపించి చేతులు దులుపుకొందని,పదేళ్ల పాటు చేనే తక సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించకుండా సంఘాలను నిర్వీర్యం చేసిందని దుయ్య బట్టా రు.
గత ప్రభుత్వం అన్ని రంగాలను అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చే సిందని, వాటి నుండి కోలుకో వడానికే ప్రభుత్వానికి సమయం పడు తుందని,గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేస్తే, కాం గ్రెస్ ప్రభుత్వం అప్పులకు మిత్తి కడుతూ పథకాలను కొన సాగిస్తుం దన్నారు.
Mlakomatireddy