Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mlakomatireddyrajgopalreddy : మునుగోడు సస్యశ్యామలం కోసం ముందుస్తు ప్రణాళికలు

మునుగోడు సస్యశ్యామలం కోసం ముందుస్తు ప్రణాళికలు

–బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇంజ నీర్లతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష

Mlakomatireddyrajgopalreddy: ప్రజా దీవెన, హైదరా బాద్: బ్రాహ్మ ణ వెల్లంల ప్రాజెక్టు నుండి మును గోడు మండలంలోని భూములను సస్యశ్యామలం చేసే దిశగా ముంద స్తు అడుగులు ముందుకు పడుతు న్నాయి. ప్రస్తుతం ఉరుమడ్ల గ్రా మం వరకే ఉన్న బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను కిష్టాపురం గ్రామం వరకు 11.5 కిలోమీటర్ల మేర విస్తరించి వీలైనంత ఆయక ట్టుకు నీటిని అందించే విధంగా ప్ర పోజల్సు సిద్ధం చేసి పనులు మొద లుపెట్టా లని మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సూ చించారు. హైదరాబాదు లోని తన నివాసంలో మంగళవారం బ్రాహ్మ ణ వెల్లేముల ప్రాజెక్టు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ని ర్వహించారు.

భవిష్యత్తులో అవసరం అయితే కిష్టాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చుకొని అక్క డి నుండి ఎగువ ప్రాంతానికి లిఫ్ట్ ల ద్వార నీరందించాలన్నారు. కిష్టాపురం వరకు వచ్చే మెయిన్ కె నాల్ తో పాటు కిష్టాపురం తర్వా త ఎంతవరకు వెసులుబాటు ఉం టే అంతవరకు డిస్ట్రిబ్యూషన్ కా లువలు తవ్వడానికి కావలసిన సర్వే, భూసేకరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పారు.

బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో సరి పడా నీరు ఉండేలా పానగల్లు ఉద య సముద్రం నుండి నీటిని తీసుకొ ని వచ్చే వానకాలం పంటలకు రెడీ గా ఉండాలని అన్నారు.భవిష్యత్తులో ఎస్ఎల్బీసి టన్నెల్ పను లు పూర్తయిన తర్వాత కృష్ణా నీటిని సమృద్ధిగా వాడుకోవడానికి పానగల్లు ఉదయ సముద్రం, బ్రా హ్మణ వెళ్లెంల ప్రాజెక్టు కెపాసిటీ పెంచుకోవాల్సి ఉంటుందన్నారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలం లో ఆయ కట్టును సాధ్యమైనంత వరకు పెం చే విధంగా పనులు వెంటనే మొద లు పెట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డి ఈ విటలేశ్వర్, ఏ ఈ ఈ నవీన్ కుమార్ లు పాల్గొ న్నారు