MlaKomatireddyRajgopalReddy : మునుగోడులో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
-- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
MlaKomatireddyRajgopalReddy: ప్రజా దీవెన, మును గోడు: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి అన్నారు.గురువారం మునుగోడు నియోజ కవర్గ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు.
నియోజకవర్గంలో కనీసం పది వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కా వాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపా రు. పార్టీలక తీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని, నిరు పేదలు అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత తన దని తెలిపారు. ఇల్లు రానివారు ఎట్టి పరిస్థితిలో బాధపడొద్దని, భయప డవద్దని, అధైర్య పడకూ డదని తెలిపారు. మొదటి విడతన అర్హు లైన నిరుపేదలకు 3500 మం దికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండగా, తక్కినవారందరికీ రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుం దన్నారు.
ఇల్లు అనేది ఆత్మ గౌరవం అని, ఇంటితోనే మహిళకు అందం వ స్తుందని, గత పది సంవత్సరాలలో ప్ర భుత్వం ఏ ఒక్కరికి ఇల్లు కట్టి న పా పాన లేదన్నారు. అర్హులు ఏ ఒక్క రు ఇందిరమ్మ ఇళ్లు లేకుం డా ఉండ రాదని, అదే సమయంలో ఎట్టి పరి స్థితుల్లో అనర్హులకు ఇల్లు రాకూ డదని, ఈ బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. కొంత మంది నిరుపేదలు ఇదివరకే బేస్మెంట్ నిర్మించుకున్నారని, అ లాంటి వారికి సైతం ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి లేఖ రా యా లని జిల్లా కలెక్టర్ కు సూచించారు.
ఇళ్ల కేటాయింపులో పూర్తి పార దర్శకంగా ఉండాలని, ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న 5 లక్షల రూపాయలు సరి పోవని ,ఈ విషయం రాష్ట్ర ముఖ్య మంత్రి తో మాట్లాడి నల్గొండ జిల్లా లోని అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉ న్నందున డిస్కౌంట్ పై సిమెంట్ ఇ చ్చే విధంగా లబ్ధిదారులకు మేలు జరిగేలా మాట్లాడతానని తెలిపా రు. తాను నిరంతరం ప్రజల సంక్షే మం కోసం, అభివృద్ధి కోసం కృషి చే స్తానన్నారు. నిరుపేద కుటుంబా ల అందరికీ సొంతింటి కళ నెరవేరే వరకూ తను పోరాడుతానని తెలిపారు .
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సంవత్స రాల తరబడి పూరి గుడిసెలో నివసిస్తు న్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మ్మ ఇళ్లు ఇవ్వడం సంతోషమని అన్నారు. నియోజకవర్గం లో సుమా రు పది వేల మంది వరకు నిరుపేదలు ఉన్నారని, వారం దరికీ ఇల్లు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మునుగోడు ని యోజకవర్గం పూర్తిగా ఫ్లోరైడ్ ప్రాంతమని సుమారు 1500 ఫీట్లు బోరూ వేసినా నీరు పడని పరిస్థితి ఉందని తెలిపారు. అర్హులకే అ న్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉంద ని,అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నారు. నియోజ కవర్గ అభివృద్ధి లో భాగంగా డిండి,ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవు తుందన్నారు.క్షేత్ర స్థాయిలో మరో సారి పూర్తిగా పరిశీలించి అర్హులై న నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశా రు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇల్లు అనేది ఇల్లు మాత్ర మే కాదని, ఆత్మ గౌరవం పెంచే కార్యక్రమం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ల బ్ధిదారుల జాబితాను పారదర్శకంగా తయారు చేశామని, ఇందుకుగా ను 200 మంది లబ్ధిదారులకు ఒక గజటెడ్ అధికారిని నియమించి జాబితాను పరిశీలించి జిల్లాస్థాయి లో వచ్చిన జాబి తాను 5% ర్యాం డం పరిశీలన చేసి లబ్ధిదారుల ను ఎంపిక చేశా మన్నారు. మునుగో డు నియోజకవర్గం లో గురువారం 2100 మం దికి ఇళ్ల పట్టాలు పంపి ణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల పట్టాలు పొం ది నవారు 30 రోజుల్లో ఇళ్ల ని ర్మాణం ప్రారంభం చేయాలన్నారు.
స్థాని క ఇసుక రీచుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుక ను ఉచితంగా ఇస్తామని,లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకా రం ఇండ్లు నిర్మించుకోవాలని, 600 చదర పు అడుగులకు పరిమి తం కావాలని, ఇండ్లు పూర్తయ్యేలోపు 5 లక్షల రూపాయలు లబ్ధి దారుల ఖాతాలో వేస్తామని,లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ల పై అవగా హన కలిగి ఉండాలని చెప్పారు. డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డై రెక్టర్ రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇం డ్ల నియమ నిబంధనలు, నిర్దేశాలు, బిల్లుల చెల్లింపు, తదితర అంశాల ను వివరించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు పొం దిన చం డూరు మండలం పుల్లెముల గ్రామా నికి చెందిన దండు ప్రేమలత ,మరో లబ్దిదారు అబీద మాట్లాడుతూ పేదలకు ముఖ్యం గా, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం సంతోషమని, ఇందుకు ప్రభు త్వానికి, శాసనసభ్యులకు రుణపడి ఉంటామని తెలిపారు.
మిర్యాల గూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలె క్టర్ నారా య ణ అమిత్,రెవిన్యూ అదనపు కలె క్టర్ జె.శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీ పీలు, తదిత రులు ఈ కార్యక్రమా నికి హాజరయ్యారు.అనంతరం ము నుగోడు నియోజ కవర్గం పరిధిలోని మండలాల లబ్ధి దారులకు జిల్లా కలె క్టర్, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.