Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MlaVemulaVeeresham : ఎమ్మెల్యే వీరేశం కీలకవ్యాఖ్య, రక్షణకవచంలా భూభారతిచట్టం

ఎమ్మెల్యే వీరేశం కీలక వ్యాఖ్య, రక్షణ కవచంలా భూభారతి చట్టం

MlaVemulaVeeresham : ప్రజా దీవెన, కట్టంగూరు: భూ భా రతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచంలా పనిచేస్తుందని న కిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. భూభారతి చట్టం 2025 పై నిర్వహిస్తున్న అవ గాహన సదస్సులలో భాగంగా, బుధ వారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగా హన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎలాంటి అన్యాయాలకు, అవక తవకులకు తావు లేకుండా ప్రభు త్వం భూభారతి చట్టాన్ని తీసు కువచ్చిందని తెలిపారు. ఇది వర కు ఉన్న ధరణి పోర్టల్ లో అధికారులకు నామమాత్రపు అధికారాలు ఉండేవని, దీనివల్ల అటు రైతులు, ఇటు ఆధికారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారని, అలాంటి పద్ధ తిని పూర్తిగా పునరుద్ధరించి భూ భారతి ద్వారా పూర్తిస్థాయిలో హ క్కులు కల్పించే అవకాశాన్ని తీసు కువచ్చినట్లు తెలిపారు.

పలు రాష్ట్రాల ఆర్ ఓ ఆర్ చట్టాలను అధ్య యనం చేసిన తర్వాత కొన్ని నెలల పాటు అందరితో సమాలోచన లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిం దని అన్నారు. ధరణి కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉండేదని, అలా కాకుండా తప్పులు లేని సమగ్ర చట్టం తేవాలని ప్రభుత్వం సంక ల్పించి చెప్పిన మాట ప్రకారం భూ భారతి చట్టం తెచ్చిందన్నారు.

భూ భారతి చట్టంలో రైతుల సమ స్యలను పరిష్కరించడమే కాకుం డా, ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డును ప్రభుత్వం ఇస్తుందని, దీ నివల్ల భూముల వివరాలన్నీ తె లుస్తాయన్నారు. అంతే కాక, భవి ష్యత్తులో రైతుకుండే భూముల హ ద్దులతో సహా, మ్యాపింగ్ చేసి ఆన్లై న్ లో ఉంచడం జరుగుతుందన్నా రు. రైతుల భూముల సమ స్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను గ్రామా లకు పం పించి పరిష్కరించునున్నదని ఆ యన వెల్లడించారు. ప్రభు త్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి భూములను సర్వే చే యించ నుందని,భూ భారతి చట్టాన్ని పక డ్బందీగా అమలు చేసేం దుకు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహక రించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించే బాధ్యత రెవెన్యూ శాఖ దని, గతంలో ధరణిలో మాదిరి కాకుండా భూ భారతి చట్టంలో ఎవ రైనా తప్పు చేస్తే ఉద్యోగం నుండి తొలగించే అధికారం ఉందని తెలి పారు. గతంలో ప్రభుత్వానికి దక్కా ల్సిన భూములను కొద్ది మంది చే తుల్లో ఉంచుకున్న అంశంపై ఆమె మాట్లాడుతూ వాటన్నింటినీ సవ రించి సంబంధిత వ్యక్తులపై చర్య లు తీసుకుంటామన్నారు.

ధరణిలో సివిల్ కోర్టుకు తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని ,తహసిల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయ ని తెలిపారు. ఆన్ సైన్డ్ ఖాతాలు, రి కార్డుల నిర్వహణ భూ భారతి లో ఉందని తెలిపారు. ధరణిలో స్వీక రించిన దరఖాస్తులన్నింటినీ భూ భారతిలో పరిష్కరిస్తామని, జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అమలులోకి రానుందని తెలిపారు.

అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నల్గొండ ఆర్ డి ఓ వై .అశోక్ రెడ్డి, త హసిల్దార్ ప్రసాద్ లు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. కాగా రైతులు శంకర్ రెడ్డి ,ధన నా యక్ ,నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం జిల్లా పరి షత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ ను శాసనసభ్యులు, జిల్లా కలె క్టర్ ప్రారంభించారు. కట్టంగూరు మండ ల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఎంపీ డీవో తదితరులు హాజర య్యారు.