–మా పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై కి వచ్చినా భయపడం
–ఖబద్దార్ కాంగ్రెస్ నాయకులన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Mlc Kalvakuṇṭlakavita : ప్రజా దీవెన, యాదాద్రి భువన గిరి: రాష్ట్రంలో అరవై లక్షల మంది సైనికులున్న బిఆర్ఎస్ పార్టీ అని, మేము తలుచుకుంటే తరిమి తరి మి కొట్టాల్సి వస్తుందని ఎమ్మె ల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా పార్టీ కార్యాల యాలు, ఇళ్లపై కి వచ్చినా భయపడే ప్రసక్తే లేదని కవిత అన్నారు. బుధవారం యా దాద్రి భువనగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
60 లక్షల మం ది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణ లో కాంగ్రెస్ నాయ కులు తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకు లారా జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ ఎస్ కార్యాలయం వైపు కన్నెత్తి చూ సినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి త మది కాదని, మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సం స్కృతి తమదని వివ రిం చారు. మూసీ కలుషితానికి కార కులెవరో ప్రజలు గుర్తించాలని మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలని, పారిశ్రామిక వ్యర్ధాలు మూసీ లో కలు స్తుంటే 60ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింద ని ప్రశ్నించారు.
మూసీ నదిని ప్రక్షా ళించడానికి మాజీ సీఎం కేసీఆర్ సంకల్పించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారన్నారు. మూసీలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభు త్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మూసీ సమస్యను శాశ్వతం గా పరి ష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. దీని ని కాం గ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తు న్నారని చెప్పారు.
మల్లన్న సాగర్ నుంచి అనుసంధానం చేస్తామనడం సరి కాదని, హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి, దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ- గోదావరి అనుసం ధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. కేవలం కాంట్రా క్టర్ల కోసమే ఈ ప్రా జెక్టు చేపడుతున్నారని, అందుకే అనుసంధాన ప్రాజెక్టు వేయండి రూ 7500 కోట్లకు పెంచారన్నారు. రూ. 7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెప్పారు.
కొండపోచమ్మ నుంచి మూసీ అన్నసంధానం చేసే ఆస్కారం ఉన్న ప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నించారు. దీనికి నల్లగొండ జిల్లా కు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి సమాధానం చె ప్పాలన్నారు.మూసీ ప్రక్షాళన పేరి ట పేదల ఇళ్లను కూల్చివేత కార్య క్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తోందని, పేదల ఇళ్లపైకి బుల్డోజ ర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిస్తోం దని కవిత అన్నారు.
మూసీ ప్రక్షా ళనకయ్యే వ్యయం రూ.50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నార న్నా రు. మూసీని ఏటీఎంగా మా ర్చుకొని, వచ్చే డ బ్బును ఢిల్లీకి పంపిం చే ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి వేసుకున్నా రని ఆరోపించారు. యాదా ద్రిలో కేసీఆర్ మొదలుపె ట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం వైభవా న్ని కోపాడాలి… యాదాద్రి వైభ వాన్ని ప్రభుత్వం కాపాడాలని కవిత కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఉమ్మడి నల్గొండ జి ల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోల డానికి కేసీఆర్ సంకల్పించార న్నా రు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటిం టికి తాగునీరు సరఫరా చేశారన్నారు. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘ నత కేసీఆర్ దని అన్నారు. అనేక ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రె స్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని చెప్పా రు.
లక్ష్మీ నారసింహస్వామిని దర్శించుకున్న కవిత… యాద గిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదర్శనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వయాన లక్ష్మీనర సింహస్వామి కేసీఆర్ కు శక్తిని అందించి ఆలయ నిర్మాణా నికి పూనుకునేలా కృప కల్పిం చారు. ఏళ్ల తరబడి నిలబడేలా, తెలంగా ణ ప్రజల కొంగుబంగారంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆల యాన్ని కేసీఆర్ మహాద్భు తంగా నిర్మించారన్నారు.రూ.1200 కోట్ల తో ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభు త్వం మిగిలిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయాలని కోరు తున్నాం.
ఇక్కడ రాజకీయాల కు అతీతంగా గుడిని అభివృద్ధి చేయాలి. భక్తు లకు మరిన్ని సౌక ర్యాలు కల్పించాలి, ప్రతినెలా ఒక రోజు ఎంతో మహోత్సవంగా నిర్వ హిస్తున్న గిరి ప్రదక్షణలో భక్తులు పాల్గొనాల న్నారు. ఆమె వెంట ఈ మీడియా సమావేశంలో భువనగిరి పార్లిమెం ట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచా ర్జ్ క్యామ మల్లేష్, జిల్లా పార్టీ అధ్య క్షులు రామకృష్ణ రెడ్డి, మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీ త మహేందర్ రెడ్డి, గాదరి కిషోర్, చిల్మూర్తి లింగయ్య, భూడిద బిక్ష్మ మయ్య గౌడ్ లతో పాటు జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నా యకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.