Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Polling: పల్లెలు పోటెత్తాయి పట్టణాలు పడకేశాయి

లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఎన్నికల సంఘం తనదైన శైలిలో చేపట్టిన చర్యలతో ఓటర్లు చైత న్యాన్ని చూపారు. ఓవరాల్ గా పల్లెలు పోటెత్తగా పట్టణాలు పడ కేశాయని చెప్పవచ్చు.

రికార్దు పోలింగ్ నమోదు అయ్యే అవకాశం
అధికారకంగా నేడు వెల్లడి కాను న్న తుది శాతం
క్యూలోని వారు అర్ధరాత్రి వరకూ ఓటేసిన సందర్భం
2019 లో 66.4శాతం, ఈసారి మరింత పెరిగే అవకాశం

ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఎన్నికల సంఘం తనదైన శైలిలో చేపట్టిన చర్యలతో ఓటర్లు చైత న్యాన్ని చూపారు. ఓవరాల్ గా పల్లెలు పోటెత్తగా పట్టణాలు పడ కేశాయని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత ఓటర్లు చూపిన చైతన్యంతో గత ఓటింగ్ శాతాన్ని అధిగమిం చే లా చేశారు. 2019 లోక్ సభ ఎన్ని కల్లో నమోదైన 66.4శాతం పోలింగ్ తాజా లోకసభ ఎన్నికలు అధిగమిం చాయి. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో 72శాతం వర కు పోలింగ్ నమోదైనట్లు అనధికా ర అంచనా. 2014 నాటి 69శాతం పోలింగ్ ను కూడా తెలంగాణ దాటే సింది. కలిసొచ్చిన చల్లటి వాతావర ణంలో ఓటర్లు స్వేచ్చగా ఓటేసి పోలింగ్ శాతం పెరుగుదలకు దోహ దపడ్డారు.

అయినప్పటికి ఎప్పటి లాగే మళ్లీ పట్టణాలే పదకేశాయి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లలో చైత న్యం వెల్లివిరిసింది. సోమవారం తెలంగాణ లో 17 లోక్ సభ స్థానా లు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక చెదురుమదురు ఘట నలు మినహా ప్రశాంతంగా ముగి శాయి. సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం ముగిసినా కొన్ని ప్రాంతాల్లో ఓటర్లులు తీరి ఉండటం తో గడువులోగా క్యూలో ఉన్నవా రికి ఓటేసేందుకు అవకాశం కల్పిం చారు. దీంతో రాత్రి పొద్దుపోయేంత వరకు తుది ఓటింగ్ శాతo72 శాతం పోలింగ్ వరకు చేరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజా పోలింగ్ సరళిని అంచనా వేసిన ఎన్నికల అధికారులు గతంకంటే పోలింగ్ శాతం పెరుగుతుందని పేర్కొంటున్నారు.

కాగా కడపటి వార్తలందే సమయానికి రాష్ట్ర వ్యా ప్తంగా 72శాతం పోలింగ్ మించే అవకాశం ఉందని అనధికారికంగా తెలుస్తోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, పలు ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయిం పు తదితర సమస్యలు ఉత్పన్నమ య్యాయి. సాంకేతికత నిపుణులు సకాలంలో సాంకేతిక ఇబ్బందులను నివారించడంతో పోలింగ్ కు ఎక్క డా ఎటువంటి అంతరాయం జరగ కుండా సాఫీగా కొనసాగింది. రాష్ట్రం లో మెజార్టీ ఘటనలేవీ చోటుచేసు కోకుండా పూర్తి ప్రశాంత వాతావర ణంలో ఎన్నికలు ముగిశాయి. ఎండ ల వేడిమి, అకాల వర్షాల ఇబ్బం దులేవీ ఎదురుకాకుండా ఉండ డంతో ఓటర్లు తాపీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో ఉదయం 9గంలకు రాష్ట్రవ్యాప్తంగా 9.48శాతం పోలింగ్ నమోదైంది. 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా మొదలు కాగా, హైదరాబాద్ లో కేవలం 5 నుంచి 6శాతమే నమోదైంది.

More polling in parliament elections

ఆదిలాబాద్ లో 9గంటలకు 13.22 శాతం పోలింగ్ జరిగినా ఆ తర్వాత వేగం పెరిగింది. ఉదయం 11గంటలకు 24.31శాతానికి చేరింది. మధ్యా హ్నం 1గంటకు ఓటర్లు పోటెత్త డంతో భారీగా క్యూలైన్లు దర్శన మిచ్చాయి. అప్పటికి 40.38శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ లో 50.18శాతం, జహీరాబాద్ లో 50.71శాతంతో మొదటి వరుసలో నిల్చాయి. ఇక అర్బన్ ప్రాంతాలైన హైదరాబాద్ దానితో పోలిస్తే 19.37 శాతంగా, మేడ్చేల్ మల్కాజ్ గిరి 27.68శాతం, సికింద్రాబాద్ 24.91 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం 3గంటలకు 52.34శాతానికిచేరిoది. సాయంత్రం 5గంటలకు 61.16శా తం చేరగా, అప్పటికే 13 మావోయి స్టు ప్రభావిత ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగి సింది.అయితే సాయంత్రం 5 వరకు కూడా గ్రామీణ ఓటర్లే ప్రధాన భూ మిక పోషించారు. భువనగిరి 72. 34శాతం, జహీరాబాద్ 71.91 శాతం ఓటింగ్ తో మొదటి వరుస లో ఉండగా, ఆదిలాబాద్ 69.81శా తంగా ఉంది. హైదదరాబాద్. 39. 17శాతం, సికింద్రాబాద్ 42శాతానికి చేరుకున్నాయి. అయితే 6 గంటల తర్వాత 61,39శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీఐ వర్గాలు తెలిపాయి. అప్పటికీ అనేక పోలింగ్ కేంద్రాలలో ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తుది ఓటింగ్ శాతం వెల్లడి కాలేదు.

ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పట్టణ ప్రాంత నియోజక వర్గాలలో పెద్దగా ఓటర్లు ఆశక్తి చూపలేదు. అంతా అనుకు న్నట్లుగానే సీమాంధ్రులు తరలిపోవడంతో ఓటింగ్ శాతంపై ప్రభావం పడింది. దీంతో జూబ్లీహి ల్స్ లోని 39.38శాతం, నాంపల్లిలో 37శాతం, మలక్ పేట లో 37.38 శాతం, చార్మినార్ లో 38శాతం, బహదూరురాలో 34శాతం, ఎల్బీ నగర్ లో 99శాతం, ముషీరాబాద్ లో 41శాతం నమోదైంది. ఇక ఆశ్వారావుపేట్లో 80.36 శాతంగా ఓటింగ్ నమోదైంది. దుబ్బాకలో కూడా 80.22శాతంగా రికార్డ యింది.
ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు.. తాజా లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వేసవి తాపంనుంచి పోలింగ్ శాతం పెంచే లక్ష్యంతో పోలింగ్ సమయా న్ని గంట పొడిగించారు. అదే సందర్భంలో అనేక సౌకర్యాలు కల్పించారు. అయినప్పటికి పట్టణాల్లో నిరాశక్తతే ఎదురైంది.

కీలకమైన ఓటింగ్ ప్రక్రియలో తొలి నుంచీ గ్రామీణ ప్రాంతాల ప్రజలనుం చే స్పందన భారీగా ఉంటోంది. ప్రభు త్వాలు ఎన్ని ఓటర్ అవగాహన చై తన్య కార్యక్రమాలు అమలు చేసి నా అవి పట్టణ ప్రాంత ఓటర్ల దరిచేరలేదు. ఓటింగ్ రోజు క్యూలో నిల్చొని ఓటేసేందుకు ఓపిక లేక నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభు త్వం గత రెండు ఎన్నికల నుంచి ప్రైవేటు కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించడంతో పాటు ఇందుకు ఉత్తర్వులు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది. కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి ప్రము ఖుల వరకు అంతా నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దీంతో ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానం గా పట్టణ ప్రాంతాల పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఓటింగ్ శాతం నానాటికీ తగ్గుముఖం పడుతు న్నది.

ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసు కున్నా పెద్దగా ప్రయోజనం కనిపించ డం లేదు. ఓటింగ్ శాతం పెంచేం దుకు సాంకేతిక మార్గాలను అవలం భిస్తున్నారు. కొత్తగా పలు యాప్ లతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా కానీ ఓటింగ్లో పాల్గొనేం దుకు కొన్ని వర్గాల్లో నిర్లక్ష్యం కనబ డుతోంది. నిర్లక్ష్యం, నిర్లిప్తత వెరసి ప్రజాస్వామ్యానికి మచ్చను తెచ్చి పెడుతుంది. పట్టణాలు, నగరాల్లోని మేధావులు, విద్యావంతుల్లోనే ఈ జాఢ్యం ఎక్కువగా కనిపిస్తున్నది. విద్యావంతులు, మేధావులుగా పేరున్న జనమే ఓటింగ్ కు దూరం గా ఉండటం ప్రజాస్వామ్యినికి చేటు గా మారుతున్నది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్ని కలనే తేడా లేకుండా నానాటికి పట్టణ, నగర ప్రాంతా ల్లో నే దారుణంగా ఓటింగ్ శాతం పడి పోతోంది.

More polling in parliament elections