Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mota Kondur Tehsildar had a heart attack: మోట కొండూరు తహశీల్దార్ కు గుండెపోటు

మోట కొండూరు తహశీల్దార్ కు గుండెపోటు

ప్రజా దీవెన/ యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు తహసిల్దార్ శాంతిలాల్ నాయక్ అకస్మాత్తుగా గుండెపోటు కు గురయ్యారు. ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో శనివారం ఆలేరు నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం మధ్యలో స్పృహ తప్పిపోయి పడిపోయిన మోటకొండూరు తహశీల్దార్ శాంతిలాల్ నాయక్ ను అధికారులు ఆసుపత్రి కి తరలించారు. గుండెపోటు రావడం తో ఎడమ చేతి భాగం పనిచేయడం లేదంటున్నా ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిర్లక్యం వహించారు.

గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న తహసీల్దార్ శాంతి లాల్ నాయక్ ఎన్నికల సన్నాహక సమావేశంలోనే కుప్పకూలడంతో అందరూ అవాక్కయ్యారు.