ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండల యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఇటీవల ఘన విజయం సాధించిన బొల్లికొండ గణేష్ ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శాలువా కప్పి అభినందించారు.ఈ సందర్బంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలం లో యూత్ కాంగ్రెస్ బలోపితానికి కృషి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి కొమురయ్య, మాజీ మార్కెట్ ఛైర్మెన్ చాడ సురేష్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు గంట్ల వేణుగోపాల్ రెడ్డి, చింత ధనుంజయ్,శాలిగౌరారం గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు నగేష్, నిమ్మల మధు, జమ్ము అశోక్ మాధగోని గోపికృష్ణ పాల్గొన్నారు.