లక్ష డప్పులు,వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఏపూరి సోమన్న
MRPS : ప్రజా దీవెన, కోదాడ: ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ ఆధ్వర్యంలో బుధవారం కోదాడలో మాదిగల చైతన్య యాత్ర ఫిబ్రవరి 7న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే ఎస్సీ వర్గీకరణ అమలకై జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ మాదిగలను చైతన్యపరిచేందుకు చేపట్టిన రథయాత్ర కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సూర్యాపేటలో ప్రారంభం గాగా రెండవ రోజు యాత్ర కోదాడకు చేరుకుంది ఈ సందర్భంగా మాదిగలు పెద్ద ఎత్తున డప్పులతో ఆటపాటలతో ఏపూరి సోమన్నకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటుచేసిన సభలో ఏపూరి సోమన్న పాల్గొని మాట్లాడుతూ
ఫిబ్రవరి 7వ తారీకు హైదరాబాదులో జరిగే లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కోదాడ నియోజకవర్గము నుండి పెద్ద ఎత్తున మాదిగ కుటుంబాలలో ప్రతి ఒక్కరూ డప్పు చేతబట్టి హైదరాబాదు మహానగరానికి చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాకారులు పాటలతో హోరెత్తించారు