Muralidhar Reddy : ప్రజా దీవన, నారాయణపురం : యదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి జనగాం ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కబడ్డీ పోటీలను బిఆర్ఎస్ నాయకులు గుడిమల్కాపూర్ మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యం తోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్రి నర్సింహ,గ్రామ శాఖ అధ్యక్షులు ఎదటి తిరుమలేష్ జనగాం ప్రిమియరి లీగ్ సీజన్ 2(జేపీల్) వ్యవస్థాపకులు బైకని సైదులు,బిఆర్ఎస్వై మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్,నాయకులు గడ్డం ముత్యాలు, తండ యాదయ్య,గడ్డం అంజయ్య,గడ్డం స్వామి,అనిల్,సాయి కుమార్,ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.