ప్రజా దీవెన, హైదరాబాద్: జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రా బాద్ లతో పాటు సైబరాబాద్ తో కూడిన భాగ్యనగరం పరిధిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నా ర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు సంక్రాంతి పండుగ పూట హల్చల్ చేశాయి. తీవ్ర కలకలం రేపుతున్న ఈ హత్యలతో పుప్పా ల్గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృత దేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి.
సంక్రాంతి సందర్భంగా స్థానికులు గాలిపటాలు ఎగరవేస్తుండగా గుట్ట దగ్గర రెండు మృతదేహాలు కనిపిం చడంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిం చారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరి శీలించి, ఇద్దరినీ దారుణంగాహత్య చేసినట్లు గుర్తించారు. మృతుల్లో యువతి, యువకుడు ఉన్నారు. ఇద్దరినీ కత్తులతో పొడిచి ఆ తర్వాత బండరాయితో మోది హ త్య చేసినట్లు పోలీసులు గుర్తిం చారు. నిన్న రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమాని స్తున్నారు. ఘటన స్థలం నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రం గంలోకి దిగి వివరాలు సేకరించే ప నిలో పడ్డాయి. ఇదిలా ఉంటే ఘట నా స్థలానికి కొంత దూరంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా కనిపించకుండా పోయా రా లేక మరెవరైనా ఇంతటి ఘోరా నికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, షూ లను చూసి నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నామ ని పోలీసులు పేర్కొంటున్నారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్న ట్లు తెలిపారు. మృతదేహాలను పో స్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘట నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.