Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Murder : స్నేహం ముసుగులో హత్య

Murder : ప్రజా దీవెన,జనగామ జిల్లా:

జనగామ జిల్లాలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది, జనగామ జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండరాయితో కొట్టి తర్వాత నిప్పంటించా రు.మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో కోతితో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా గుర్తించారు పోలీసులు.

 

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకన్నను మూడు వందల రూపాయలు తన స్నేహి తులు అడిగారని, వెంకన్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయం పై ఇరువురి మధ్య వివాదం నెలకుంది,

 

ముందు ఇరువురి మధ్య పరస్పరం మాటల యుద్దం పెరిగి ఘర్షణ ముదరడంతో వెంకన్నను అక్కడే ఉన్న బండరాయితో కొట్టి హత్య చేశారు స్నేహితులు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు పోలీసులు.