Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్గొండ: నల్గొండ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొనీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అద్భుతమైన పురోగతి సాధించింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వర్శిత్ రెడ్డి మాట్లాడుతూ
గణతంత్ర దినోత్సవం కేవలం గతాన్ని వెనక్కి తిరిగి చూడటమే కాదు.. భవిష్యత్తును ఊహించడం కూడా. స్వాతంత్ర్యం సాధించడం నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారడం వరకు.. భారతదేశం అద్భుతమైన పురోగతి సాధించింది. శాంతి, సుస్థిరత, ఆవిష్కరణల కోసం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మనమందరం మన దేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేద్దాం” జైహింద్!
అలాగే.. “గణతంత్ర దినోత్సవం నాడు మన హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని మనం గౌరవిద్దాం. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత తమ పాత్రను ప్రతిబింబించాల్సిన సమయం ఇది. యువ పౌరులుగా, భవిష్యత్ నాయకులుగా.. ఈ గొప్ప దేశం ఆలోచనలు, ఆవిష్కరణలు, మన రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం వంటి ఆదర్శాలను రాబోయే తరాలకు చాటిచెప్పేలా.. భారతదేశం పురోగతికి కృషి చేద్దాం”.
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు..