ప్రజా దీవెన,కోదాడ: విద్యార్థులు మంచి లక్షయాలను ఎంచుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని మండల సహకార జూనియర్ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోని స్థానిక యం.యస్ జూనియర్ కళాశాల లో ఏర్పాటుచేసిన విద్యార్థుల తో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా క్రమ శిక్షణతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు,తల్లి దండ్రులు తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.
కళాశాల,అధ్యాపకులు పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని,విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివి తల్లి దండ్రులకి,కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు,అధ్యాపకులు గంగాధర్, ఇనుద్దీన్, కె.శ్రీనివాస్ ,యం.శ్రీనివాస్ రావు సునీత,కల్పన,విజయ భాస్కర్,వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.