–సంచలన తీర్పు వెల్లడించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి
Nalgonda Court :ప్రజాదీవెన నల్గొండ : మహిళ పై యాసిడ్ తో దాడి చేసి, హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, 2 వేల జరిమాన విదిస్తూ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బుధవారం సంచలనం తీర్పు వెల్లడించారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియాకు తెలిపారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన పిట్టల మహేష్ తండ్రి పెద్దయ్య అదే గ్రామానికి చెందిన మహిళను వేధించి యాసిడ్ తో చంపేందుకు యత్నించగా బాధితురాలు నిందితుడు పిట్టల మహేష్ పైన నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి
ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయగా నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి సెక్షన్ 307 ఐపీసీ (హత్యాయత్నం)కింద నేరానికి పదేళ్ల జైలు,
రూ.1000 జరిమానా, సెక్షన్ 326-ఏ ఐపీసీ (యాసిడ్ దాడి)కింద పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా రెండూ ఏకకాలంలో 20 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా మొత్తం రూ. 2000 విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో సరైన ఆధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు దేవరకొండ డిఎస్పి ఎస్.మహేశ్వర్,
నాంపల్లి ఎస్సై, డి. విజయ్ కుమార్, ప్రస్తుత దేవరకొండ ఏ ఎస్ పి పి.మౌనిక, సిఐ డి. రాజు, ప్రస్తుత నాంపల్లి ఎస్సై ఎం.శోభన్ బాబు, ఏపీపీ ఆర్.అఖిల, సిడిఓ బి.సైదులు, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్
లను జిల్లా ఎస్పీ అభినందించారు.