Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Ila Tripathi: రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన, నార్కట్ పల్లి: భూ స మస్యలను పరిష్కరించేందుకు రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సులను రైతులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రెవె న్యూ సదస్సుల లో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా నా ర్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సుకు హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాము ఖి మాట్లాడుతూ వారికున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఏవైనా భూ సమస్యలు ఉన్నట్ల యితే రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాల ని, ఒకవేళ ఎవరైనా రెవెన్యూ సదస్సులకు హాజరు కాలేకపోతే, ఈనెల 20 వరకు నేరుగా తహసిల్దార్ కార్యా లయంలో దరఖాస్తుల ను సమర్పిం చవచ్చని స్పష్టం చేశారు.భూ సమ స్యల పరిష్కారం లో భాగంగా చట్ట ప్రకారం వెసులుబాటు ఉంటే రైతు లకు మేలు చేసేందుకు కృషి చేస్తా మని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ఎవరైనా ప్రభుత్వ భూము లను అన్యక్రాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించి అన్ని రకాల సమస్య లను పరిష్కరించడం జరుగుతుం దని, అందువల్ల వీటిని సద్విని యో గం చేసుకోవాలని ఆమె పునరుద్ఘాటించారు.

అంతకుముందు కలెక్టర్ నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని 2 వ అంగన్వాడి కేంద్రాన్నిసందర్శించి”అమ్మ మాట అంగన్వాడి బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన గర్భిణి స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలతో మాట్లాడి ప్రభు త్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంది స్తున్న పౌష్టికాహారం, చిన్న పిల్లలకు పాఠశాల పూర్వ విద్యపై తీసు కుంటున్న చర్యలు వివ రించారు.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలం దరిని తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రం లో నమోదు చేయించాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బా లింత లు కూడా అంగన్వాడీ లో నమోదు కావాలని, దీనిద్వారా ప్రభుత్వం వారికై ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు మంచి అవకాశం అని తెలిపారు. గర్భిణీ స్త్రీలు సమ యానికి పరీక్షలు చేయించుకోవ డంతో పాటు, పౌష్టికాహారం తీసుకో వాలని, లేనట్లయితే జన్యు లోపం తో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నా యని, అంతేకాక పుట్టిన తర్వాత చనిపోయేందుకు అవకాశాలు ఉ న్నాయని తెలిపారు. జన్యు పర మైన లోపాలతో పిల్లలు పుట్టకుం డా ఉండేందుకు మేనరికం వివా హాలు, మూఢనమ్మకాల వంటివి పాటించవద్దని కోరారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికా హారం తో పాటు, ఐరన్ ఫోలిక్ మా త్రలు ఇవ్వడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసు కోవా లన్నారు. పెళ్లయిన మహిళలు గర్భిణీ కావాలనుకున్నప్పుడు 3 నెలల ముందు నుండే ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకో వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంగ న్వాడీ కేంద్రాల ద్వారా మంచి పోష కాహారంతో పాటు, మెను లో ఎగ్ బిర్యానీ ని చేర్చడం జరిగిందని, దీనివల్ల ఆరోగ్యం బాగా మెరుగవు తుందని తెలిపారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ చిన్న పిల్లలతో రై మ్స్ పాడించారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, నార్కె ట్ పల్లి తహసిల్దార్ వెంకటే శ్వరావు, సిడి పిఓ హరిత తదితరులు ఉన్నారు.