Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Tripathi : ప్రత్యేక ప్రజావాణిలో దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీక రించాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ప్రత్యేక ప్రజా వాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికా రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదే శించారు. శుక్రవా రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మం దిరంలో వయో వృ ద్ధులు, దివ్యాంగుల కై ప్రత్యేక ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిం చాలని, పెన్షన్లు మంజూరు చేయా లని దివ్యాంగులు దరఖాస్తులను సమర్పించగా, తమ పిల్లల నుండి పోషణ భత్యం ఇప్పించాలని, పిల్ల లు తమను పోషించే విధంగా చూ డాలని, అలాగే భూముల సమస్య లు ష్కరించాలని కోరుతూ వయో వృద్ధులు దరఖాస్తులను సమర్పిం చారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో (72) మంది దివ్యాంగులు, వయో వృద్ధులు వారి సమస్యల పరిష్కా రానికి దరఖాస్తులను సమర్పించా రు.

దరఖాస్తుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రజావాని ద్వారా వచ్చిన దరఖా స్తుల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అ న్నారు.

కాగా కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ పట్ట ణానికి చెందిన నాగమ్మ అనే మ హిళ మనస్థాపానికి గురై ఇంట్లో నుండి బయటకు వచ్చి నల్గొండ రైల్వే స్టేషన్ లో ఉండగా సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ గుర్తిం చి మహిళా శిశు సంక్షేమ శాఖకు స మాచారం అందించగా, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నా గమ్మను వైద్య కళాశాలలో చేర్పిం చి ప్రథమ చికిత్స అందించిన అనం తరం గత 3 రోజులుగా సఖి సెంట ర్లో ఆశ్రయం కల్పించారు. అనంత రం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వా రా సమాచారం అందించగా, శుక్ర వారం నాగమ్మ కుటుంబ సభ్యులు నల్గొండకు రాగా, జిల్లా కలెక్టర్ స మక్షంలో నాగమ్మ ను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిం ది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ వయోవృద్ధుల సంరక్ష ణ, వారి బాగోగుల బాధ్యత వారు కన్న పిల్లలపై ఉంటుందని, అందు వల్ల ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రు లను ప్రేమానురాగాలతో చూసుకో వాలని అన్నారు.

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జెడ్పి సీఈఓ ప్రేమకరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, నల్గొండ , దేవరకొండ, చండూరు ఆర్డీవోలు వై. అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం అదనపు కలెక్టర్ ఆ ధ్వర్యంలో సదరం సర్టిఫికెట్లకు సం బంధించి యుడిఐడిపై రూపొం దిం చిన గోడపత్రికను ఆవిష్క రించా రు.