Nalgonda DSP : నేరరహిత నల్లగొండగా తీర్చిదిద్దుదాం
--ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వాములు అయితేనే ఫలితం --ఆగస్టు చివరాంతం వరకు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు --సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో తక్షణమే ఏర్పాటుకు కృషి
నేరరహిత నల్లగొండగా తీర్చిదిద్దుదాం
–ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వాములు అయితేనే ఫలితం
–ఆగస్టు చివరాంతం వరకు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు
–సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో తక్షణమే ఏర్పాటుకు కృషి
ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల తో పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేస్తు న్న పోలీసుల ( police ) ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు కలిసి పని చే యాలని నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి ( dsp shiva ramreddy) కోరారు.
నల్లగొండ పట్టణ వన్ టౌన్, టూ టౌన్, రూరల్ వివిధ కాలనీల ము ఖ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతో ( muncipal councilor ) డి. ఎస్.పి కార్యాలయంలో నిర్వ హించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిది ద్దడం కోసం పోలీసులు కృషి చేస్తు న్నారని, ఇందులో ప్రజలు భాగ స్వాములైనప్పుడే సులభంగా ఫలితాలు లభిస్తాయని చెప్పారు.
ముఖ్యంగా శివారు ప్రాంతాలు, నూత నంగా ఏర్పాటు అవుతున్న కాలనీలో నేరాలు జరగకుండా నివారిం చేందుకు సీసీ కెమెరాలను( cc cameras) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివ రించారు. అదే సమయంలో ఇప్పటికే పలు కాలనీలలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా చూడాలన సూచించారు. గంజా యి విక్రయాలు, గంజాయి ( ganjay) సేవిస్తున్న వారిని గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువత గంజాయి బారినపడి తమ బంగారు భవిష్యత్తుకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు.ఎప్పటికప్పుడు ప్రజలకు, పాఠశాల, కళాశాల విద్యార్థు లకు, యువతకు (students, youth) అవగాహన కల్పిస్తూ వా రు పెడదోవ పట్టకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు న్నామని చెప్పారు.
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రజలు త మ ఇళ్లలో, కాలనీలలో, అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటి సంబంధిత పోలీస్ స్టేషన్లతో అను సం ధానం చేయడం ద్వారా దొంగతనాలు, నేరాలు (crime) జరిగిన ప్పుడు వాటిని సులువుగా పరిష్కరించి అవకాశం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ ప్రజల రక్షణ కోసమే పనిచేస్తున్న విషయాన్ని ప్రజలంతా గుర్తించి ఎక్కడ ఎలాంటి సం ఘ టన జరిగినా డయల్ 100 ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా పోలీ సులకు సమాచారం అందించి బాధ్యత గల పౌరులుగా సహకరిం చాలని ఆయన కోరారు.
సమాజంలో జరిగే నేరాలను అరికట్టడానికి ప్రజలు, ప్రజా ప్రతినిధు లు సహకరించినప్పుడే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమ వు తుందని చెప్పారు. నల్లగొండ (nalgonda) పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న క్ర మంలో నేరాల అదుపులో ప్రజాభాగస్వామ్యం ముఖ్య మని శివరాం రెడ్డి సూచించారు. ఇందుకోసం ప్రజలను మరింత చైత న్యం (awarness) లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇకనుండి పట్టణంలోని కాలనీలు, అపార్ట్మెంట్, రిలేటెడ్ కమ్యూ నిటీ కాలనీల అసోసియేషన్ల (associations) ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డులలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తు న్నామని, దీనికి సంబంధిత వార్డుల కౌన్సిలర్లు తమకు సహకరించా లని ఆయన కోరారు.
ఈ అవగాహన సదస్సులో పట్టణ వన్ టౌన్, టూ టౌన్ సి.ఐలు ఏమి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డానియల్ కుమార్, ట్రాఫిక్ సిఐ బిట్టు క్రాంతి కుమార్, ఏస్ ఐ లు సందీప్ రెడ్డి, మానస, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సమ ద్,బాబా, గడిగ శ్రీను, నవీన్ గౌడ్ అభిమన్యు, శ్రీనివాస్, ఇంతియా జ్, యూత్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొ న్నారు.
Nalgonda DSP