Nalgondamurder: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రం నడిబొడ్డులో దారుణ హత్య జరిగింది. నల్లగొండ డిఎస్పి కార్యాలయంతో పాటు పో లీస్ స్టేషన్ కు కొత్తవేటుదూరంలో ఈ సంఘటన చోటు చేసుకోవ డంతో నీలగిరి ప్రజలు ఉలిక్కి ప డ్డారు.
గుర్తుతెలియని దుండగులు అతి కి రాతకంగా కత్తులతో నరికి హత్య చేయడంతో సురేష్ అనే వ్యక్తి అక్క డికక్కడే మృత్యువాత పడ్డాడు.
నల్లగొండ పట్టణంలోని రామగిరి సెంటర్ లోపల గీతాంజలి కాంప్లెక్స్ లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓనర్ సురేష్(37) ను గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వే ట కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చా రు.
విచక్షణారహితంగా గుండెల్లో పొడి చి మెడపైన వేట కత్తు లతో దాడి చేసినట్లు, దాడిని తప్పించుకునే ప్రయత్నం చేసిన సురేష్ చివరకు అక్కడే అవిశ్వాస విడవాల్సివచ్చింది.కుటుంబ కలహాలా లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కో ణంలో కేసు న మోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలి పారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలానికి చేరుకున్న డిఎ స్పి శివ రాం రెడ్డి సిసి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.