—ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 11: ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు 18000 వేతనం నిర్ణయించి ఇతర అలవెన్సులు ప్రకటించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. చలో హైదరాబాద్ ఆశా కార్యక్రమానికి సిఐటియు ఆశ వర్కర్లని అరెస్ట్ లో భాగంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళిని ఆశా కార్యకర్త పల్లేటి కౌసల్య ను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు.
అనంతరం మాట్లాడుతూ ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యం వ్యవస్థలో స్వేచ్ఛగా మాట్లాడి హక్కు లేకుండా ఇచ్చిన హామీలను అడగడానికి వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని అన్నారు. ఫిబ్రవరి 9న జూలై 30న ఆరోగ్యశాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.