Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: తెలంగాణ కోసం న్యాయంగా పోరాడిన వ్యక్తి ప్రొ. జయశంకర్

— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ (Kothapally Jayashankar sir)అని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy)అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్క రించుకుని మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని (Collector’s Office)సమావేశ మం దిరంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ తన జీవి తాన్నే అంకితం చేశారని కలెక్టర్ అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, అంతకు ముందు జరిగిన నాన్ ముల్కీ ఉద్య మం లోనూ ఆయన ఎంతో కృషి చేశా రని, ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తన రచనల ద్వారా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో తనదైన శైలిలో కృషి చేశారని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర ,అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ తదితరులు ఆచార్య జయశంకర్ (Kothapally Jayashankar sir)చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.