Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narri Swami : న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తాం న్యాయవాది నర్రి స్వామి

Narri Swami : ప్రజా దీవన, నారాయణపురం : జనగామ జిల్లా పట్టణ కేంద్రంలో జిల్లా అత్యున్నత న్యాయస్థానం జిల్లా కోర్టు ఆవరణలో లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి జనగామ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్ర ఋషి సంయుక్త కార్యదర్శి మణ్యం సత్తయ్యలతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం కై ఉద్యమిస్తాం బార్ కౌన్సిల్ ఎన్నికలలో విద్యావంతులైన న్యాయవాదులు సామాజిక న్యాయం పోరాడే వ్యక్తులను గెలిపించాలి అని సామాజిక విప్లవం సామాజిక చైతన్యం విద్యావంతల నుంచే మొదలు కావాలి అని తెలియజేశారు.

 

 

అదే విధంగా జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 5 వేల గౌరవ వేతనం ఇవ్వాలి అన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంయుక్త కార్యదర్శి చంద్ర ఋషి, సత్తయ్య మాట్లాడుతూ లాయర్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్న నర్రి స్వామి కుర్మ సామాజిక చైతన్యం కోసం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. రాజకీయ చైతన్యం కోసం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన యొక్క సామాజిక జిజ్ఞాసని తెలియజేశారు. జనగాంలో న్యాయవాదులపై జరిగిన దాడిని ఖండిస్తూ వుమన్ రైట్స్ లో కూడా కేసు వేసి పోరాడినటువంటి వ్యక్తి అని తెలియజేశారు.