Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nationwide Strike : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మే 20న దేశవ్యాప్త సార్పత్రిక సమ్మె.

_ నేడు సూర్యాపే టలో జరిగిన సమ్మె సన్నహాక జిల్లా సదస్సులో జాతీయ కార్మిక సంఘాల పిలుపు.

Nationwide Strike :ప్రజాదీవెన, సూర్యాపేట  :ఈనెల 20న కేంద్ర ప్రభుత్వ ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జిల్లా సన్నహాక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ సంఘాల నాయకులు ఐ ఎన్ టి యు సి కాసాని పాపయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు ఈ సదస్సుకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర నాయకులు ప్రసాద్, ఐ ఎన్ టి యు సి జిల్లా కన్వీనర్ కాసర్ల శ్రీనివాస్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేమ్మాది వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని అన్నారు. కార్పోరేట్, బహుళ జాతి కంపెనీల అధిపతులు అంబానీ,ఆదానీలకు
ప్రజా సంపదను, అటవీ సంపదను కట్టబెట్టె ఆలోచన తప్ప ప్రజా సమస్యల ను పరిష్కరించే దానిపై మోడీ కి లేదన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి కనీసం కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకొని, యాజమాన్యాలతో బేరసారాలు చేసుకొనే హక్కును కోల్పోయే విధంగా కార్మిక వర్గానికి మరణశాసనం రాసారని అన్నారు.

కార్మికుల కనీస వేతనాలు తరిగిపోతున్నాయని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవని, ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరితో వెట్టిచాకిరి చేయించుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వెంటనే వారిని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌక గా అమ్మి వేయడం ఆపి రక్షించాలని కోరారు. ఆటో ,హమాలీ లాంటి అసంఘటితరంగా కార్మికులకు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీమ్ వర్కర్స్ ఆశ, అంగన్వాడి, గ్రామపంచాయతీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ వర్కర్స్ కు కనీస వేతనాలను 26వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు అప్పగించి ఆలోచన విరమించుకోవాలని ,50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి కార్మికుడికి నెలకు 6000 రూపాయలు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు శ్యామల అశోక్, ఎస్.రాఘవరెడ్డి, సైదులు ,సిఐటియు జిల్లా నాయకులు ముత్యాలు, ఎలుక సోమయ్య ,సైదులు, సాయికుమార్, ఐ ఎన్ టి యు సి నాయకులు ముస్తఫా, శ్రీను, రవి, వెంకట్ ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేసోజు మధు, జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, నాగేల్లి రామ నరసయ్య వివిధ రంగాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.