ఎన్జీ కళాశాల ఎన్ సీసీ ఆధ్వర్యంలో అన్నదానం
ప్రజా దీవెన, నల్గొండ టౌన్: ఎన్ సీసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భం గా స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్ సీసీ క్యాడే ట్లు నల్గొండ పట్టణంలోని హిమా లయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వ హించడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ పట్టణంలోని ప్రధా న కూడలిలలో నిరాశ్ర యులైన పేదలకు భోజనం ప్యాకె ట్లు పంచి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సము ద్రాల ఉపేందర్ ఎన్సిసి క్యాడేట్లకు ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ శుభా కాంక్షలు తెలియజేశారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంటులో ఎన్సిసి యాక్ట్ of 1948 ద్వారా చట్టబద్ధ మైందని, దేశభక్తిని పెంపొందించ డం, దేశ రక్షణకు మద్దతు ఇవ్వ డం, సమాజ సేవ, జాతీయ ఐక్యత అనే ఉద్దేశాలతో ఎన్సిసిని స్థాపిం చడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్ మాట్లాడుతూ ఎన్సిసి విద్యార్థులకు సైనిక శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడం, యువతను దేశ సేవకు ఆకర్షించ డం,సహజీవన మరియు సమాజ సేవా కార్యక్రమాల ద్వారా సమా జానికి మేలు చేయడం వంటి ముఖ్యమైన విధానాలతో ఏర్పాటు కావడం జరిగిందని తెలియజేశారు.
ఎన్సిసి ద్వారా యువతలో నైతిక విలువలు, శారీరక శక్తి మరియు సామాజిక బాధ్యత పెంపొందిస్తాయని. ఇది భారత దేశంలోని యువ తకు రక్షణ రంగంతో పాటు, పౌర జీవితంలో నూ అనేక అవకా శాల ను అంది స్తుందని తెలియజేశారు. కార్యక్ర మంలో ఎన్జీ కళాశాల ఎన్సిసి క్యాడేట్లు పాల్గొన్నారు.
Ncc service