Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET 2025 : జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలలో 890 మంది విద్యార్థులు వ్రాయనున్న నీట్ 2025 ప్రవేశ పరీక్ష

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

NEET 2025 : ప్రజాదీవెన, సూర్యాపేట : ఆదివారం :4వతేదీన జరిగే నీట్ 2025 ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట, టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ స్కూల్ & కళాశాల (బాలికలు ) ఇమాంపేట, తెలంగాణ మైనార్టిస్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కళాశాల దురాజ్ పల్లి, గవర్నమెంట్ జూనియర్ కళాశాల సూర్యాపేట మొత్తం 4 పరీక్ష కేంద్రాలలో 890 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయునున్నట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష హాల్ లోకి అనుమతి ఉంటుందని పరీక్షకి హాజరు అయ్యే విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకుంటున్నందున విద్యార్థులు ఉదయం 11:00 లకే పరీక్ష కేంద్రాలకి చేరుకోవాలని మధ్యాహ్నం 1:30 కి ఎంట్రీ గెట్ ముసివేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు. పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్‌లు, పర్సులు, బంగారు ఆభరణాలు తదితర ఎలాంటి వస్తువులు అనుమతిలేదని తెలిపారు. ఆయా కేంద్రాల్లో కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు,అవసరమైన బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిర్వహించి పరీక్షలను పకడ్బoదిగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా,పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిల్స్‌ను పోస్టాఫీసులకు తరలింపు భద్రంగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలాని పోలీస్ అధికారులకు సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లు ఏర్పాటు చేసి అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరంగా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగు నీరు ఉండాలన్నారు.

నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థి తీసుకువెళ్ళవలసినవి: –

1. అడ్మిట్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు పోస్ట్ కార్డ్ సైజు ఫోటో ఫార్మాట్‌లో ఉండాలి.
2. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో (హాజరు పట్టికకు అతికించడానికి).
3. గుర్తింపు పొందిన ID (పాన్/డ్రైవింగ్ లైసెన్స్) ఓటర్ ID/పాస్‌పోర్ట్/ ఆధార్ కార్డ్ (ఒరిజినల్ ఫోటోతో/ఇ-ఆధార్).
4. PWBD సర్టిఫికేట్ అనుబంధం VIII.
5. CMO/సివిల్ సర్జన్/మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ NTA ప్రొవైడర్ ద్వారా తప్పనిసరిగా సంతకం చేయబడిన స్క్రైబ్ ఉండాలి.
6. PWDD అభ్యర్థులకు ఒక గంట పరిహారం ఉంటుంది.
7. అభ్యర్థులు పెద్ద బ్యాడ్జ్‌లు, పెద్ద బటన్లు, బ్రోచెస్ మొదలైనవి ధరించకూడదని సూచించబడింది. ఒకవేళ ఉంటే వాటిని అడిగి తొలగించాలి.
8. అభ్యర్థులను ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 01:30 వరకు కేంద్రానికి అనుమతిస్తారు.

అభ్యర్థి తీసుకువెళ్లకూడనివి: –

1. స్టేషనరీ వస్తువులు.
2. మొబైల్, బ్లూటూత్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్ మొదలైనవి.
3. వాలెట్, పర్సు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, ల్యాప్.
4. ఆభరణాలు/మెటాలిక్ వస్తువులు.
5. ఆహార పదార్థాలు, ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు.
6. ఫుల్ హ్యాండ్ షర్ట్స్ , బూట్లు ధరించరాదు.