— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
NEET Candidates Exam :ప్రజా దీవెన, నల్లగొండ: నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీ క్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శని వారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం, అలాగే మహాత్మా గాంధీ యూనివ ర్సిటీలో ఏర్పాటుచేసిన నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి తనిఖీ చే శారు.
ముందుగా జిల్లా కేంద్రంలోని రామ గిరి లో ఉన్న మహిళా డిగ్రీ కళాశా లలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రా న్ని తనిఖీ చేసి అక్కడ సౌకర్యా లను, బందోబస్తు ఏర్పాట్లను తని ఖీ చేశారు. అనంతరం ఎంజి యూ నివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు .
కాగా నీట్ అండర్ గ్రాడ్యుయేట్ -2 025 ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తం గా 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే యగా, 7 కేంద్రాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 4 పరీక్ష కేంద్రాలు, ఎన్జీ కళాశాలలో ఒకటి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒకటి, కేంద్రీయ విద్యాలయలో మ రొక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చే యడం జరిగింది. మొత్తం 2087 మంది అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీ క్షకు హాజరుకానున్నారు.
ప్రవేశ పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లను ఆమె తనిఖి చేయడమే కాక పరీక్ష కేం ద్రాల సూపరింటిండెంట్లు,నోడల్ అధికారి, సంబంధిత శాఖల అధి కారులకు మరోసారి ఆదేశాలు జా రీ చేశారు. పరీక్షరాసే అభ్యర్థులు ఉదయం 11 గంటలకు పరీక్ష కేం ద్రానికి చేరు కోవాలని ఆమె కోరా రు. మధ్యా హ్నం ఒకటిన్నర త ర్వాత పరీక్ష కేంద్రం ప్రధాన గేట్లను మూసివేయడం జరుగుతుందని పునరుద్ఘాటించారు.
పరీక్ష మధ్యా హ్నం 2 గంటల నుం డి సాయంత్రం 5 గంటల వరకు ఉం టుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు అన్నింటిని మరో సారి పరిశీలించుకోవాలని ముఖ్యం గా తాగు నీరు, విద్యుత్, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలు ,తదితర అ న్నింటిని పునః పరిశీలించాలని తె లిపారు.
జిల్లా ఎస్పీ చంద్ర పవర్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి ,నీట్ నోడల్ ఆఫీసర్ ,కేంద్రీయ విద్యా లయ ప్రిన్సిపాల్ శ్రీని వాసు లు తదితరులు ఉన్నారు.