Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET Exam 2025 : నీట్ పరీక్ష ప్రశాంతం జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్

–04కేంద్రంలో నీట్ పరీక్ష నిర్వహణ

–నీట్ పరీక్షకు 859 మంది హాజరు

NEET Exam 2025 :ప్రజాదీవెన, సూర్యాపేట :నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు విధానం,విద్యార్థుల హాజరు వివరాలను అధికారుల నుండి తెలుసుకున్నారు.పరీక్ష నిర్వహిస్తున్న తీరునుఆదివారం నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు.

జిల్లాలో మొత్తం 890 మందిలో 859 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు,31మంది గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో 04 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష శాంతియుత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించబడిందని కలెక్టర్ తెజస్ ఒక ప్రకటన లో వెల్లడించారు.