Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

neetexamresults : నీట్ లో మెరిసిన తెలంగాణ గురుకులం

--204 మంది గురుకుల విద్యా ర్థులకు ఉత్తమ ర్యాంకులు --అభినందించిన గురుకుల కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి

 

neetexamresults: ప్రజా దీవెన హైదరాబాద్: దేశంలోని ప్రతి ష్టాత్మకమైన ఎంబీబీఎస్ (మెడికల్ విద్య ను) అభ్యసించేం దుకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ 2025 ప్రవేశ పరీక్షలో సాంఘిక సం క్షేమ గురుకుల విద్యార్థులు వి శేష ప్రతిభ కనబర్చారు. అత్యుత్త మ స్థాయి లో ప్రతిభ చూపించిన 204 మంది విద్యార్థులు వైద్య విద్య ను (MBBS ) అభ్యసించేం దుకు సీటును పొందే అవకాశం సాధిం చారు.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయంలో మొత్తం 873 మంది నీట్ 2025 ప్రవేశ పరీక్షకు హాజరు కాగా ఇందులో 204 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. గత ఏడాది నీట్ 20 24 లో మొత్తం 720కి మార్కులకు గాను 720 మార్కులు మొదటి ర్యాంకు సా ధించగా. ఈ ఏడాది 2025 నీట్ ప్రవేశ పరీక్ష కఠినంగా ఉండటంతో 686 మార్కులు సాధించిన విద్యా ర్థికి మొదటి బ్యాం కు వచ్చింది.

ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నప్పటికీ సాం ఘిక సంక్షేమ ( COE) విద్యా ర్థులు అకుంఠిత దీక్ష అదే విధంగా అధ్యా పకులు నిరంతర శ్రమ ఫలితంగా విద్యార్థులు అధిక సంఖ్యలో మెడి సిన్ లో సీటు సా ధించటం పట్ల గు రుకుల కార్యదర్శి డాక్టర్ వి. ఎస్ అలగు వర్షిని విద్యార్థులను, అధ్యా పకులను అలాగే తల్లిదండ్రులను అభి నం దించారు.

గత సంవత్సరంలో అమలుప ర్చిన పటిష్టమైన మైక్రో షెడ్యూల్ మరియు ముఖ్యమైన పాఠ్యాంశాల పై పునః చరణ వల్లనే ఇది సాధ్య మైందని కార్యదర్శి తెలిపారు.ఈ ఫలితాలను ప్రేరణగా తీసు కొని ఈ విద్యా సంవత్సరం లో ఇంకా మెరుగైన ఫలితాలను సాధిం చడా నికి సరైనా ప్రణాళికతో మరియు సమిష్టి కృషితో ముందుకు వెళ్తామ ని కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు.

సాంఘిక సంక్షేమ గురుకుల వి ద్యార్థులు MBBS లోఉత్తమ ఫలి తాలు సాధించడం పట్ల ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అలాగే సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ విద్యార్థులను, సి బ్బందిని అభినందించారు.

 


*ర్యాంకుల వివరాలు*

1. సి.హెచ్ .స్పందన గౌలిదొడ్డి
(సి ఓ ఈ ) మార్కులు: 521 , కమ్యూనిటీ ర్యాంక్ 14214

2. నవ్య, గౌలిదొడ్డి (సి ఓ ఈ ) మార్కులు :521 కమ్యూనిటీ ర్యాంకు 14305
3. డి సహదేవ్ (గౌలిదొడ్డి బాయ్స్ సి ఓ ఈ) మార్కులు: 517, కమ్యూనిటీ ర్యాంక్: 16234
4. శ్రీ చరిత గౌలిదొడ్డి (సి ఓ ఈ) మార్కులు; 51 1
5. ఎస్ అక్షయ , గౌలీదొడ్డి (సి ఓ ఈ ) మార్కులు : 507 , కమ్యూనిటీ ర్యాంక్ 20863
6. డి ప్రవళిక, మహీంద్రా హిల్స్ సిఓఈ మార్కులు 502, కమ్యూనిటీ ర్యాంక్ : 6078
7. పి అశోక్ గౌలిదొడ్డి (సి ఓ ఈ )మార్కులు 493 , కమ్యూనిటీ ర్యాంక్ 28781
8. జి .అంజనీ ప్రియ, అంబేద్కర్ కాలేజ్ ఖమ్మం, మార్కులు 491 , కమ్యూనిటీ ర్యాంక్ 30044

*కమ్యూనిటీ పరంగా టాప్ ర్యాంకులు*

1.ఎం మూర్తి . (ఎస్సీ) గౌలిదొడ్డి (COE) మార్కులు :488 ర్యాంకు: 1898

2. ఏ రోహిత్,( ఎస్సీ) గౌలిదొడ్డి
(సి ఓ ఈ ) మార్కులు 468,
ర్యాంకు : 4096

3. ఏం.శంకర్ ( ఎస్టీ)
గౌలిదొడ్డి (సి ఓ ఈ )
మార్కులు 479 ర్యాంకు 5026

4. శ్రీనాథ్ , (ఎస్టీ) గౌలిదొడ్డి (సి ఓ ఈ) మార్కులు 472 ర్యాంకు 642.

సాంఘిక సంక్షేమ గురుకుల వి ద్యార్థులు నీట్ 2019 సాధించిన ర్యాంకుల ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక మైన వైద్య కళాశాలుగా పేరుగాంచి న ఉస్మానియా , గాంధీ, అలాగే కాకతీయ మెడికల్ కళాశాలలో వీరికి సీట్లు లభించే అవకాశం పుష్కలంగా ఉంది.