Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nirmala Kumari: గ్రంథాలయాల అభివృద్ధికి డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం చేసిన సేవలు మరులేనివి : ప్రిన్సిపల్ నిర్మల కుమారి.

Nirmala Kumari:ప్రజాదీవెన, కోదాడ: దేశంలో గ్రంథాలయాల అభివృద్ధికి డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ (Dr. SR Ranganathan)చేసిన సేవలు మరువలేనివని KRR ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. నిర్మల కుమారి (Nirmala Kumari) అన్నారు. జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.అర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో ఉన్న ఎన్నో విలువైన పుస్తకాలను చదివిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం (Technical knowledge_) అభివృద్ధి చెందిన తర్వాత డిజిటల్ లైబ్రరీ సౌకర్యం కూడా అందిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంధాల అధికారి మాతంగి యాకోబ్, అధ్యాపకులు చందా అప్పారావు, బి సైదిరెడ్డి, శ్రీలత, సత్యవాణి, ఫ్రాన్సిస్, ఎస్ ఎమ్ రఫీ, పల్లపాటి.సైదులు, ఏ రాజు, రాంబాబు,యాదమ్మ,భవాని,సైదులు రమ,ఇస్మాయిల్, విద్యార్థులు పాల్గొన్నారు