భారత రాజ్యాంగాన్ని కాపాడాలి.
ప్రజా దీవెన,కోదాడ::భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పట్టణములోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తా నుండి మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్, మొలుగూరి నాగరాజు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి జరిగినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు సహకారమైనట్లు అని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా తీసుకొని బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.ఈ ర్యాలీలో బీసీ సంఘాలు,దళిత సంఘాలు, ప్రజాసంఘాలు,యువజన సంఘాలు,కోదాడ సామాజిక నాయకులు పాల్గొన్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రాయబారపు కుటుంబరావు,ఎంఆర్పిఎస్ నాయకులు రాజు మాదిగ,పిడమర్తి దశరథ,కాంపాటి వీరస్వామి,డిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు,సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ,బిజెపి నాయకులు ఓరుగంటి కిట్టు,తమలపాకుల లక్ష్మీనారాయణ ఎమ్మెస్ఎఫ్ నాయకులు పండిటి నవీన్,తోట కమలాకర్,సూరేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.