–మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
English Medium in Government Schools :ప్రజాదీవెన, నల్గొండ :రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 2021-2022 విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. కానీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పరిస్థితులు కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో టీఎస్ యుటిఎఫ్, తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ ఇంగ్లీష్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేసినట్లు తెలంగాణ విద్యా కమిషన్ లో పేర్కొన్నదని అన్నారు.
దీనిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆంగ్లంలో సులభంగా మాట్లాడడం, బోధించుటకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టిన టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీని అభినందించారు. అనంతరం హైదరాబాదు నుండి వచ్చిన కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బోధకులు బి.కె.రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషలో సులభంగా మాట్లాడవచ్చని, భాషను మైండ్ కు అనుసంధానం చేయడం ద్వారా ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించవచ్చని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రెడ్ల సైదులు, కార్యదర్శులు గేర నర్సింహ, రమాదేవి, నలపరాజు వెంకన్న, మధుసూదన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.